Begin typing your search above and press return to search.

మలేషియా నుండి ప్రభాస్ కోసం వచ్చింది!

By:  Tupaki Desk   |   20 Nov 2018 8:20 AM GMT
మలేషియా నుండి ప్రభాస్ కోసం వచ్చింది!
X
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' ప్రభాస్ క్రేజ్ ను పీక్స్ లోకి తీసుకెళ్ళింది. అంతకు ముందువరకూ టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలాంటి ఒక విదేశీ ఫ్యానే మియా సూరాయ. ఈ లేడీ ఫ్యాన్ మలేషియా లోని కౌలాలంపూర్ లో ఉంటుంది.

దూరం అయినా.. వేరే దేశం అయినా.. హైదరాబాద్ లోని ప్రభాస్ ఇంటికి రావడమే ఈ వీరాభిమాని టార్గెట్ గా పెట్టుకుందట. ఆమె అనుకున్నట్టే ఈమధ్యే హైదరాబాద్ వచ్చింది. ప్రభాస్ ఇంటిదగ్గరకు వెళ్ళింది. ప్రభాస్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడేమో.. మియాకు తన ఫేవరేట్ హీరోను కలవడం కుదరలేదు. కానీ ప్రభాస్ ఇంటిముందు నిలబడి ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి 'మిషన్ పూర్తయింది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

'బాహుబలి' ఇతర దేశాల్లో రిలీజ్ కావడంతో ప్రభాస్ కు మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పటికే మలేషియా.. సింగపూర్. జపాన్ లాంటి దేశాలలో ప్రభాస్ అభిమానులు నెక్స్ట్ ఫిలిం 'సాహో' కోసం ఎదురు చూస్తున్నారట. 'సాహో' కూడా హిట్ అయితే ఇక ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ అని కాకుండా గ్లోబల్ స్టార్ అని పిలవాలేమో.