Begin typing your search above and press return to search.

మహేష్ 20 రోజుల ప్లాన్ వేశాడు

By:  Tupaki Desk   |   12 March 2018 7:06 AM GMT
మహేష్ 20 రోజుల ప్లాన్ వేశాడు
X
ఎంత పెద్ద సినిమాకైనా ఈ రోజుల్లో ప్రమోషన్స్ అవసరం అనేలా మన తారలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే తన ప్రతి సినిమాకి ప్రమోషన్స్ చేస్తూనే ఉంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే మహేష్ ప్రమోషన్స్ లో ఈ సారి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాడు. వరుసగా బ్రహ్మోత్సవం - స్పైడర్ డిజాస్టర్ అవ్వడంతో భారత్ అనే నేను సినిమాతో నష్టాలను రికవర్ చేయాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే ఫస్ట్ ఓథ్ - విజన్ ఆఫ్ భరత్ లాంటి డిఫెరెంట్ స్టైల్ లో సినిమా స్థాయిని పెంచిన మహేష్ అదే ఉపును సినిమా రిలీజ్ అయ్యే 20 రోజుల ముందుగానే ఉండాలని అనుకుంటున్నాడట. అంతే కాకుండా మహేష్ సోషల్ మీడియా టీమ్ ను కూడా మార్చేసినట్లు తెలుస్తోంది. సినిమా స్థాయిని పెంచేలా వర్క్ చేసే వారిని ఎంచుకున్నాడాట. సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. అయితే షూటింగ్ పనులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నా దర్శకుడు కొరటాల అనుకున్న టైమ్ లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. లండన్ షెడ్యూల్ ఆలాగే రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట.

ఇకపోతే ఆ 20 రోజుల్లో సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని ప్రేక్షకులకు తెలిసేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయట. నిర్మాతలు ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.ఇంటర్వ్యూలు అని అలాగే ప్రెస్ మీట్స్ అని మిగతా ప్రమోషన్స్ ఎలాగో ఉంటాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ వేడుక మేజర్ ప్లస్ పాయింట్. అది భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. శ్రీమంతుడు కాంబినేషన్ రిపీట్ అవుతుందని అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా మహేష్ చేసే పాత్ర అందరిని ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.