Begin typing your search above and press return to search.

మహేష్, ప్రభాస్, త్రివిక్రమ్, కృష్ణవంశీ కలిసి..

By:  Tupaki Desk   |   27 Nov 2015 11:30 AM GMT
మహేష్, ప్రభాస్, త్రివిక్రమ్, కృష్ణవంశీ కలిసి..
X
అవును.. మహేష్ బాబు - ప్రభాస్ - త్రివిక్రమ్ - కృష్ణవంశీ ఒక్కటయ్యారు. అంతా కలిసి ఒక కుర్రాడిని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ కుర్రాడు మరెవరో కాదు.. సంతోష్ శోభన్. ‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న ఈ కుర్రాడిని ఇంతమంది కలిసి ప్రమోట్ చేయడానికి కారణం లేకపోలేదు. అతను దివంగత దర్శకుడు శోభన్ కొడుకు. మహేష్ బాబు ‘బాబి’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శోభన్.. ప్రభాస్ తో ‘వర్షం’ తీసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, కృష్ణవంశీలతో దర్శకత్వ శాఖలో పని చేశాడు కూడా. అందుకే వీళ్లందరూ కలిసి సంతోష్ కోసం మీడియా ముందుకొచ్చారు.

మహేష్ ‘తను నేను’ ట్రైలర్ లింక్ ట్విట్టర్లో షేర్ చేస్తూ సంతోష్ కు ఆల్ ద బెస్ట్ చెబితే.. మిగతా ముగ్గురు సంతోష్ తో కలిసి ఓ వీడియో మెసేజ్ ద్వారా అతణ్ని ఆశీర్వదించాలంటూ ప్రేక్షకుల్ని కోరారు. తాను చిరునవ్వుతో సినిమా చేస్తున్నపుడు శోభన్ చేసిన సాయం గుర్తు చేసుకుంటూ.. ‘గోల్కొండ హైస్కూల్’ సినిమాలో సంతోష్ పెర్ఫామెన్స్ చూసి ఈ కుర్రాడెవరో హీరో అవుతాడని అనుకున్నాని, తర్వాత అతనే శోభన్ కొడుకు అని తెలిసి సంతోషించానని చెప్పాడు త్రివిక్రమ్. ఇక కృష్ణవంశీ.. మురారి సినిమాకు శోభన్ త పని చేసిన రోజుల్ని గుర్తి చేసుకున్నాడు. ప్రభాస్ తనకు ‘వర్షం’ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన శోభన్ కు రుణపడి ఉంటానని.. ఆయన కొడుకైన సంతోష్ ను తన అభిమానులు, ప్రేక్షకులు ఆదరించాలని కోరాడు.