Begin typing your search above and press return to search.

ఏఎంబి మాల్ స‌క్సెసైతే షిరిడీకొస్తామ‌ని?!

By:  Tupaki Desk   |   20 Jan 2019 8:01 AM GMT
ఏఎంబి మాల్ స‌క్సెసైతే షిరిడీకొస్తామ‌ని?!
X
వెకేష‌న్స్ పేరుతో సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌డం మ‌హేష్ ఫ్యామిలీకి అల‌వాటు. ఏమాత్రం సెల‌వులు దొరికినా సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ సెల‌బ్రేష‌న్ మూడ్ లోకి వెళ్లిపోతుంది. గ‌త కొంత‌కాలంగా ఈ ఫ్యామిలీ ప‌ర్యట‌న‌ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్ వేడుక‌లు మొద‌లు, కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ ను విదేశాల్లో జ‌రుపుకున్నారు. మ‌హేష్‌- న‌మ్ర‌త‌- సితార - గౌత‌మ్ బృందం విదేశాల్లో జాలీ ట్రిప్ ల‌తో సెల‌బ్రేట్ చేసుకున్నారు. అయితే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల అనంత‌రం మ‌హేష్ తిరిగి `మ‌హ‌ర్షి` షూటింగ్ లో బిజీ అయిపోయారు. కొంత గ్యాప్ అనంత‌రం లేటెస్ట్ గా సంక్రాంతి సెల‌వుల్ని మ‌హేష్ ఫ్యామిలీ డివోష‌న‌ల్ ట్రిప్ లా డిఫ‌రెంట్ గా ప్లాన్ చేయ‌డం విశేషం. ఈ ట్రిప్ లో మ‌హేష్ ఉన్నారో లేదో తెలీదు కానీ, న‌మ్ర‌త తో పాటు కిడ్స్ క‌నిపించారు.

నేటి ఉద‌యం స‌డెన్ గా న‌మ్ర‌త శిరోద్క‌ర్- సితార‌- గౌత‌మ్ బృందం ముంబై విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మయ్యారు. షిరిడీ వెళ్లి సాయినాధుని ద‌ర్శించుకుని, అటుపై ముంబైకి వ‌చ్చార‌ట‌. చిన్న‌పాటి విరామంలోనే ఈ ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది. అక్క‌డ కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల‌తో జాలీ టైమ్ ని స్పెండ్ చేశారు న‌మ్ర‌త‌. ముంబైలో బంధుమిత్రుల‌తో క‌లిసి దిగిన కొన్ని ఫోటోల్ని న‌మ్ర‌త ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.

సంక్రాంతి, ద‌స‌రా వంటి సంద‌ర్భాల్లో న‌మ్ర‌త త‌న కిడ్స్ తో పాటుగా మ‌హేష్‌ స్వ‌గ్రామం బుర్రిపాలెం వెళ్లి వ‌స్తుంటారు. ఇదివ‌ర‌కూ విలేజ్ లో జాలీ ట్రిప్ ల‌కు సంబంధించిన ఫోటోల్ని న‌మ్ర‌త సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. బ్రిట‌న్, అమెరికా, దుబాయ్ సెల‌బ్రేష‌న్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఈసారి డివోష‌న‌ల్ టూర్ అనంత‌రం ట్రిప్ కి సంబంధించిన ఫోటోల్ని న‌మ్ర‌త షేర్ చేశారు. భారీ పెట్టుబ‌డుల‌తో స్టార్ట్ చేసిన‌ ఏఎంబి సినిమాస్ థియేటర్ బిజినెస్ స‌క్సెసైతే షిరిడీ కి వెళ్లి మొక్కు తీర్చుకుంటామ‌ని మొక్కుకున్నారా? అంటూ అభిమానుల్లో హాట్ డిస్క‌ష‌న్ మొద‌లైంది.