Begin typing your search above and press return to search.

కోర్టుకు వెళ్ళకుండానే సెటిల్ చేసిన మహేష్?

By:  Tupaki Desk   |   12 Jun 2018 10:09 AM GMT
కోర్టుకు వెళ్ళకుండానే సెటిల్ చేసిన మహేష్?
X
బ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాలు ఫ్లోప్ అవ్వడంతో కెరీర్ లో బాగా డీలా పడిపోయిన మహేష్ బాబుకి భరత్ అనే సినిమా హిట్ అవ్వడంతో జోష్ వచ్చింది. ఇదిలా ఉండగా మహేష్ బాబుకి - వంశీ పైడిపల్లికి - పీవీపీ కి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. దానిని ఉల్లంఘించాడు మహేష్ అని రూమర్లు మనం వింటూనే వచ్చాం.

బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అయిన సమయంలో మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. బ్రహ్మోత్సవం వల్ల నష్టపోయిన పీవీపీ ఈ సినిమాను నిర్మించాల్సి ఉంది. అడ్వాన్స్ గా కొంత మొత్తాన్ని కూడా మహేష్ కు ముట్టజెప్పాడట పీవీపీ. కాకపోతే భరత్ అనే నేను సినిమా మొదలవ్వకముందే.. దిల్ రాజు అండ్ అశ్విని దత్ లతో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు మహేష్‌. అందుకే పీవీపీ మహేష్ బాబు మరియు వంశీ పైన పివిపి కోర్టు కేస్ పెట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజా రిపోర్టుల ప్రకారం మహేష్ కోర్ట్ దాకా వెళ్ళకుండానే ఈ విషయాన్ని సెటిల్ చేసేశాడట.

పీవీపీ పెద్ద ప్రొడక్షన్ బ్యానర్. ఇప్పుడు వారితో గొడవలు - కోర్టు కేసులు ఈ గోలంతా ఎందుకు అని అనుకున్న మహేష్‌.. కొంత మొత్తాన్ని పివిపికి ముట్టజెప్పి.. ఆ విషయాన్ని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాడట. మొత్తానికి ప్రాబ్లెమ్ అయితే సాల్వ్ అయిపోయినట్టే అంటున్నారు సన్నిహితులు. మహేష్-వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ ఇంకో పది రోజుల్లో మొదలవనుంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు అని తెలిసిన విషయమే.