Begin typing your search above and press return to search.
మహేష్ రిటర్న్ ఫ్లైట్ లో దిగారు!
By: Tupaki Desk | 17 Jun 2019 4:11 AM GMTసూపర్ స్టార్ మహేష్ కుటుంబ సమేతంగా విదేశాలకు జాలీ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జోటిక్ యూరప్ ఆద్యంతం చుట్టేసిన మహేష్ జర్మనీ.. ప్యారిస్ లాంటి కాస్ట్ లీ నగరాల్ని విజిట్ చేశారు. అటుపై లండన్ .. ఇంగ్లండ్ లో పర్యటించారు. అయితే ఈ పర్యటన ఆద్యంతం నమ్రత సహా క్యూట్ కిడ్స్ సితార.. గౌతమ్ అతడితో కలిసి జాలీ ట్రిప్ ఎంజాయ్ చేశారు. వరల్డ్ కప్ లో ఓవల్ లో జరిగిన ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ ని ఫ్యామిలీ సమేతంగా వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని నమ్రత శిరోద్కర్ రగ్యులర్ గా షేర్ చేశారు. ఈ ఫోటోలు అభిమానుల్లో అంతే జోరుగా వైరల్ అయ్యాయి. ఈసారి ట్రిప్ లో డాడ్ తో కలిసి క్యూట్ సితార చేసిన అల్లరి మామూలుగా లేదు. ఇక గౌతమ్ ఎంత సైలెంట్ గా కనిపిస్తాడో అంతటి అల్లరోడు అని కొన్ని ఫోటోలు చెప్పకనే చెప్పాయి.
మహర్షి సక్సెస్ ని ఇలా జాలీ ట్రిప్ రూపంలో సెలబ్రేట్ చేసుకున్న మహేష్ తదుపరి కెరీర్ 26వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`(ఎంబీ 26) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్కిప్ కొట్టిన మహేష్ అప్పటికే యూరప్ ట్రిప్ వెళ్లిపోయారని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం విదేశీ ట్రిప్ ముగిసింది. తిరిగి ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు.
శంషాబాద్ (హైదరాబాద్) విమానాశ్రయం నుంచి తాజాగా మహేష్ బయటకు వస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. వీటిలో క్యూట్ సితార చెయ్యి పట్టుకుని మహేష్ బయటకు వస్తూ ఎంతో జోవియల్ గా కనిపించారు. తనతో పాటే నమ్రత.. గౌతమ్ కూడా ఫోటోల్లో కనిపించారు. మహర్షి కోసం ఏడాది పాటు కఠోరంగా శ్రమించిన మహేష్ ఆ స్ట్రెస్ నుంచి ఇప్పటికి రిలీఫ్ అయ్యారని అర్థమవుతోంది. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణతో తిరిగి బిజీ అయిపోతారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణలో మహేష్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మహర్షి సక్సెస్ ని ఇలా జాలీ ట్రిప్ రూపంలో సెలబ్రేట్ చేసుకున్న మహేష్ తదుపరి కెరీర్ 26వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో అనీల్ సుంకర- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు`(ఎంబీ 26) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్కిప్ కొట్టిన మహేష్ అప్పటికే యూరప్ ట్రిప్ వెళ్లిపోయారని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం విదేశీ ట్రిప్ ముగిసింది. తిరిగి ఆయన హైదరాబాద్ కి చేరుకున్నారు.
శంషాబాద్ (హైదరాబాద్) విమానాశ్రయం నుంచి తాజాగా మహేష్ బయటకు వస్తున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. వీటిలో క్యూట్ సితార చెయ్యి పట్టుకుని మహేష్ బయటకు వస్తూ ఎంతో జోవియల్ గా కనిపించారు. తనతో పాటే నమ్రత.. గౌతమ్ కూడా ఫోటోల్లో కనిపించారు. మహర్షి కోసం ఏడాది పాటు కఠోరంగా శ్రమించిన మహేష్ ఆ స్ట్రెస్ నుంచి ఇప్పటికి రిలీఫ్ అయ్యారని అర్థమవుతోంది. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణతో తిరిగి బిజీ అయిపోతారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణలో మహేష్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.