Begin typing your search above and press return to search.

మహర్షి కోసం అరుదైన కలయిక

By:  Tupaki Desk   |   25 April 2019 8:49 AM GMT
మహర్షి కోసం అరుదైన కలయిక
X
కార్మిక దినోత్సవం నాడు మే 1న జరిగే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా కాబట్టి వేడుక చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. దీనికి గాను ఇప్పటిదాక మహేష్ నటించిన పాతిక సినిమాల దర్శకులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ప్లానింగ్ జరుగుతోందట.

అంటే రాజకుమారుడు తీసిన రాఘవేంద్ర రావు గారితో మొదలుకుని ఇప్పుడు మహర్షి డీల్ చేసిన వంశీ పైడిపల్లి దాకా అందరూ ఒకేసారి కనిపిస్తారు. ఇదే నిజమైతే అరుదైన కలయికగా చెప్పుకోవచ్చు దాదాపు అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఈజీగా సమీకరించవచ్చు. కాని ఒక్క దర్శకుడు మాత్రం మిస్ అవుతారు.

బాబీ దర్శకుడు శోభన్ 11 ఏళ్ళ క్రితమే కాలం చేశారు. సో ఆయన తప్ప మిగలిన అందరూ వచ్చే అవకాశం ఉంది. అంటే 24 దర్శకులు వస్తారన్న మాట. శోభన్ కూడా బ్రతికి ఉంటె నిజంగానే గొప్ప జ్ఞాపకంగా మిగిలేది. ఆయన లేని లోటుని భర్తీ చేసేది కాదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడీ 24 దర్శకులు వస్తారా రారా అనే దాని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది . ఇప్పటికే ఆడియోలో నాలుగు పాటలు వచ్చేసాయి కాబట్టి బాలన్స్ ట్రాక్ తో పాటు ట్రైలర్ ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉంది