Begin typing your search above and press return to search.

మ‌హేష్ AMB సినిమాస్‌ లో 2.O

By:  Tupaki Desk   |   13 Nov 2018 4:34 AM GMT
మ‌హేష్ AMB సినిమాస్‌ లో 2.O
X
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బిగ్ రేంజ్ చెయిన్ బిజినెస్‌ పై క‌న్నేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూ స్టార్‌ డ‌మ్‌ ని ఆస్వాధిస్తూనే - మ‌రోవైపు సుస్థిర ఆదాయ మార్గాల వైపు అన్వేషిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న ట్రెండ్‌ ను అత‌డు అంద‌రి కంటే ముందే ప‌సిగట్టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే మ‌హేష్ తొలి అడుగు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ బిజినెస్‌ లో అడుగుపెడుతున్నారు. ఈ రంగంలో అనుభ‌వం ఉన్న‌ ఏసియ‌న్ సినిమాస్‌ తో క‌లిసి భారీగా మ‌ల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగాడు.

మొద‌టి మ‌ల్టీప్లెక్స్ AMB సినిమాస్ పేరుతో అత్యంత ఖ‌రీదైన‌ గ‌చ్చిబౌళి ప‌రిస‌రాల్లోని కొత్త‌గూడ ఏరియాలో నిర్మించారు. మ‌ల్టీప్లెక్స్‌లో M -లాంజ్ ప‌రిస‌రాల్లో ఉన్న‌ ఈ థియేట‌ర్‌ని లాంచ్ చేసేందుకు స‌రైన ముహూర్తం కోసం వేచి చూస్తున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈనెల 8న `థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్` చిత్రంతో సినిమా స్క్రీన్ల‌ను ప్రారంభించాల‌ని భావించారు. కానీ అనూహ్యంగా అది కాస్తా వాయిదా ప‌డింది. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కానీ - బిగ్ బి అమితాబ్ కానీ హైద‌రాబాద్‌ కి వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేస్తే వారితో లాంచ్ చేయించాల‌ని న‌మ్ర‌త మ‌హేష్ ప్లాన్ చేశారు. కానీ థ‌గ్స్ బృందం అస్స‌లు హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్ కే రాక‌పోవ‌డంతో ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారు.

తాజాగా మ‌రో కొత్త తేదీని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 2.ఓ చిత్రాన్ని త‌మ థియేట‌ర్‌ లో తొలిగా ప్ర‌ద‌ర్శించాల‌ని భావిస్తున్నార‌ట‌. 2.ఓ ప్ర‌మోష‌న్స్ కోసం ఎలానూ సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ - అక్ష‌య్ కుమార్ - శంక‌ర్ లాంటి దిగ్గ‌జాలు హైద‌రాబాద్ లో అడుగుపెడ‌తారు కాబ‌ట్టి వారి స‌మ‌క్షంలో అత్యంత వైభ‌వంగా లాంచ్ చేయాల‌న్న‌ది ప్లాన్ అని తెలిసింది. ప్ర‌స్తుతం మ‌హేష్ అమెరికాలో మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. మ‌ల్టీప్లెక్స్ లాంచ్ కి ప‌క‌డ్భందీగా ప్లాన్ చేయ‌డంలో న‌మ్ర‌త బిజీగా ఉన్నార‌ట‌.