Begin typing your search above and press return to search.

'లేడీస్ ఓన్లీ' అంటున్న మాజీ హీరోయిన్

By:  Tupaki Desk   |   24 April 2017 5:46 AM GMT
లేడీస్ ఓన్లీ అంటున్న మాజీ హీరోయిన్
X
ఒకే ఒక్క టీజర్ తో.. కేవలం కార్ లో నలుగురు లేడీస్ మాట్లాడుకుంటున్న మాటలతో మగలర్ మట్టుం(లేడీస్ ఓన్లీ) సెన్సేషన్ సృష్టించింది. ఇప్పుడీ మూవీకి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మాజీ హీరోయిన్ జ్యోతిక ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించగా.. భానుప్రియ.. శరణ్య(నిజంలో మహేష్ బాబు తల్లి).. ఊర్వశి ప్రధాన పాత్రలు పోషించారు.

ట్రైలర్ స్టార్టింగ్ లోనే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై దూసుకొస్తున్న జ్యోతిక షాక్ ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి జ్యోతిక చేసిన కొన్ని సాహసాలను ట్రైలర్ లో జత చేశారు. మూవీ కోసం జ్యోతిక ఏ స్థాయి అడ్వంచర్స్ కు సిద్ధమైందో చెప్పకనే చెప్పారు. అక్కడి నుంచి స్టోరీలోకి టర్న్ అయిన ట్రైలర్.. మిగిలిన ముగ్గురి ఇళ్లలో పరిస్థితులు కనిపిస్తాయి. వీటి నుంచి కొంత రిలీఫ్ కోసం.. మూడు రోజుల పాటు టూర్ కి బయల్దేరతారు. ఎక్కడికి వెళ్తున్నాం అనే ప్రశ్న అడక్కూడదనేది షరతు. మళ్లీ తిరిగి వస్తావుగా అని భార్యను ఓ పాత్రతో అడిగించారంటే.. వారిలో ఉండే అభద్రతా భావాన్ని ఏ స్థాయిలో చూపించారో తెలుస్తుంది.

ఇక ఈ నలుగురు లేడీస్ కలిసి.. ఎక్కడ తిరిగారు.. ఏమేం చేశారు.. అసలు ఎవరి ఇంటిలో ఏంటి పరిస్థితి.. చివరకు ఏం జరిగిందన్నది మిగతా స్టారీ. ఆటిట్యూడ్ చూపిస్తూ.. ఎప్పుడూ చేతిలో కెమేరా పట్టుకునే పాత్రలో జ్యోతిక లుక్ సూపర్బ్ గా ఉంది. మిగిలిన లేడీస్ అంతా ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు కావడంతో.. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా కుదిరింది. జ్యోతిక భర్త హీరో సూర్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/