Begin typing your search above and press return to search.

కిలికీ రైటర్.. మహేష్‌ కోసం తొలిసారి

By:  Tupaki Desk   |   18 Aug 2017 7:36 AM GMT
కిలికీ రైటర్.. మహేష్‌ కోసం తొలిసారి
X
బాహుబలి సినిమా మొదటి భాగంలో కాలాకేయ మాట్లాడినా కిలికీ భాష కేవలం ఆ సినిమా కోసమే కనుగొన్నారు. ఈ కల్పిత కొండ భాషను కనిపెట్టడంలో ముఖ్య పాత్ర వహించినది తమిళ్ మాటల రచయత - గేయరచయత మధన్ కర్కీ. అయితే ఈ సినిమా తరువాత తెలుగులో మళ్ళీ పాటలు రాసే అవకాశం రాకపోయినా మళ్ళీ ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో ఒక పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు సూపర్ స్టార్ కి రాయబోతున్న ఈ పాట తెలుగులో మధన్ రాస్తున్న మొదటి తెలుగు పాట అవ్వడం విశేషం.

తమిళ్ సినిమాలకు మాటలు పాటలు అందిస్తున్న మధన్ను ఒక తెలుగు పాట కోసం మహేశ్ బాబు స్పైడర్ టీమ్ అడిగిందిని తెలుస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ అంతా అయిపోయాన ఇంకా చిన్న చిన్న ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి అని చెబుతున్నారు. విడుదల తేది కూడా ఒకటి ఫిక్స్ చేసిన తరువాత కొత్తగా ఒక పాట కోసం ఇప్పుడు మధన్ ను అడగడం కొత్త ఆసక్తిరేపింది. మధన్ మాట్లాడుతూ “ మహేశ్ సినిమాకు పాట రాసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ మురుగదాస్ గారికి నా కృతజ్ఞతలు. నా పై వాళ్ళ పెట్టుకున్న నమ్మకాన్ని మహేశ్ బాబు పై అభిమానులు పెట్టుకున్న ఆశలను దృష్టిలో పెట్టుకొని పాట రాస్తాను” అని అన్నాడు.

స్పైడర్ సినిమా షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న దసరా కానుకుగా రాబోతుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాలో మరో స్టార్ డైరెక్టర్ యెస్.జె. సూర్య ప్రతినాయకుడు గా నటిస్తున్నాడు. స్పైడర్ సినిమాకు సంగీతం హరీష్ జయ రాజ్ సమకూరుస్తున్నాడు.