Begin typing your search above and press return to search.

లక్ష్మీ పార్వతి పిల్లల కోసం అలా చేసిందా?

By:  Tupaki Desk   |   18 Dec 2018 10:33 AM GMT
లక్ష్మీ పార్వతి పిల్లల కోసం అలా చేసిందా?
X
నందమూరి తారక రామారావు చనిపోయిన సమయం లో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆయన హార్ట్‌ ఎటాక్‌ తో మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే ఆ హార్ట్‌ ఎటాక్‌ ఎలా వచ్చిందనే విషయం పై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకున్నారు, ఇంకా ఊహించేసుకుంటూనే ఉన్నారు. లక్ష్మీ పార్వతి వల్లే చనిపోయాడని కొందరు, లేదు పదవి పోవడం వల్ల చనిపోయాడని మరి కొందరు భావిస్తున్నారు. మరి ఈ విషయాన్ని వర్మ తన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ లో ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.

లక్ష్మీ పార్వతి పిల్లలు కావాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌ కు ఏవో మందులు ఇచ్చేదని, ఆ మందుల వల్ల ఎన్టీఆర్‌ కు హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందని పుకార్లు ఉన్నాయి. ఎన్టీఆర్‌ తో పిల్లలు కనాలని నిజంగానే లక్ష్మీ పార్వతి భావించారని మీరు అనుకుంటున్నారా అంటూ వర్మ కు ప్రశ్న ఎదురైన సమయం లో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ద్వారా పిల్లల్ని కనాలని లక్ష్మీ పార్వతి అనుకున్నట్లు గా నాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆమె మందులు ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలు ఊహాజనితం అని నేను అనుకుంటున్నాను. ఆ విషయం నిజం అయితే మందులు ఇచ్చిన డాక్టర్‌ అయిన, ఎన్టీఆర్‌ లేదా లక్ష్మీ పార్వతి చెప్పాలి. ఆ విషయం వారు చెబితే కాని క్లారిటీ రాదు. అందుకే తన సినిమాలో ఆ విషయాలు ఉండవని వర్మ క్లారిటీ ఇచ్చాడు.

తన సినిమాలో ఎక్కువ గా ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల పెళ్లి కి ముందు సన్నివేశాలు, పెళ్లి సమయంలోని సన్నివేశాలు, పెళ్లి తర్వాత కుటుంబంలోని సన్నివేశాలను మాత్రమే చూపించబోతున్నట్లు గా చెప్పుకొచ్చాడు. వారిద్దరి అనుబంధం, సంసార జీవితం గురించి తాను డెప్త్‌ గా ఎంక్వౌరీ చేయలేదని వర్మ పేర్కొన్నాడు.