Begin typing your search above and press return to search.

మధురవాణిని మర్చిపోయావే రాక్షసి?

By:  Tupaki Desk   |   21 May 2018 5:25 PM GMT
మధురవాణిని మర్చిపోయావే రాక్షసి?
X
ఓ సినిమా ఎవరికైనా నచ్చితే.. ఆ సినిమాను ఎవరైనా పొగడాలని అనుకుంటే.. ఆ మూవీకి చెందిన ప్రతీ ఒక్కరినీ పొగిడేయాలని రాజ్యాంగంలో రూలేమీ లేదు. ఫలానా బాగుంది అని అంటే.. మిగిలివన్నీ బాలేదని అర్ధం కాదు. ఇవాల్టి రోజుల్లో మీడియా ఇలాగే అర్ధాలు తీస్తోంది కానీ.. నిజానికి దాని వెనుక చాలానే కథ ఉండొచ్చనే విషయం పట్టించుకోవడం లేదు.

మహానటి మూవీపై కాసింత లేటుగా అయినా.. అందాల రాక్షసి లావణ్యా త్రిపాఠి స్పందించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనను స్పెషల్ గా పొగిడింది. అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా చేసిందని.. నిజంగా మహానటి అని పొగిడింది లావణ్య. అలాగే ఈ సినిమాలో ఇతర నటీనటుల గురించి కూడా స్పెషల్ గా ముందే ప్రస్తావించింది. దుల్కర్ సల్మాన్.. చైతన్య.. విజయ్.. మోహన్ బాబు.. భరణి.. షాలిని.. ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారని.. తనకు సినిమా విపరీతంగా నచ్చిందని చెప్పిందీ అందాల రాక్షసి. అయితే.. వీరందరితో పాటు సమంత పేరు చెప్పకపోవడమే ఆశ్చర్యం కలిగించింది.

ఒక్క కీర్తి ని మాత్రమే పొగిడి ఉంటే.. సామ్ పేరు రాయలేదనేందుకు ఆస్కారం లేదు. కానీ దాదాపు ప్రధాన నటులు అందరిని పొగిడి.. ఒక్క సమంతను మాత్రమే విస్మరించడం వెనుక.. ఉద్దేశ్యపూర్వకంగానే చేసే కారణం ఒకటి ఉందిట. అక్కినేని నాగచైతన్య చివరగా యుద్ధం శరణం మూవీలో కనిపించాడు. అప్పటివరకూ చైతు సక్సెస్ ట్రాక్ లో ఉండగా.. లావణ్యతో నటించిన ఈ మూవీ ఫెయిల్ అయింది. ఇది సరిగ్గా సామ్ తో చెయ్ పెళ్లికి ముందు జరిగింది. అప్పుడు సామ్-చైతు-లావణ్య కొన్ని మాటలు మారడంలో తేడాలు రావడంతో.. అప్పటి నుంచి వారిద్దరికి కాసింత దూరం దూరం అంటోందిట లావణ్య త్రిపాఠి.