Begin typing your search above and press return to search.

చికాగో సెక్స్ రాకెట్ పై లాస్య-అనసూయ చెప్పిన నిజాలివీ

By:  Tupaki Desk   |   16 Jun 2018 10:24 AM GMT
చికాగో సెక్స్ రాకెట్ పై లాస్య-అనసూయ చెప్పిన నిజాలివీ
X
‘టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందా.?’... వివాదాస్పద నటి శ్రీరెడ్డి అర్థనగ్నంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు నిరసన తెలిపినప్పుడు అందరి మదిలోనూ ఉదయించిన ప్రశ్న ఇదే. బాధితులేమో ఉందంటూ బజారున పడ్డారు.. బాధించిన వారే తాము కాదంటూ ఉలిక్కిపడ్డారు.. అసలు కాస్టింగ్ కౌచ్ బయటపడ్డాక తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం సమావేశమై ఏవేవో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు.

కానీ తాజాగా అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలై టాలీవుడ్ పై మరో పిడుగు పడింది. అమెరికాలో టాలీవుడ్ నటీనటులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు అరెస్ట్ అయ్యారు. ఈ సంచలనం వెలుగుచూడడంతోపాటు టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారనే విషయం బయటపడింది. ఈ వివాదాన్ని క్యాష్ చేసుకోవడానికి హాట్ హాట్ గా టీవీ చర్చలు నడుస్తున్నాయి. ఈ హాట్ చర్చల్లోనే తాజాగా పాల్గొన్న యాంకర్ లాస్య పలు సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకొని భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్న యాంకర్ లాస్య చెప్పిన విషయాలు టాలీవుడ్ ని మరో కుదుపు కుదుపుతున్నాయి.

ప్రముఖ యాంకర్ లాస్య తాజాగా ఓ టీవీచర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాకు ఈవెంట్స్ పేరుతో వచ్చే హీరోయిన్ల బండారాన్ని బయటపెట్టారు. కొందరు హీరోయిన్లకు వ్యభిచారం చేయాలనే ఆలోచన లేకపోయినా డాలర్స్ ఆశ చూపించి వారిని ముగ్గులోకి దించుతున్నారని లాస్య తెలిపింది. కుప్పతెప్పులుగా డబ్బు వస్తుండడంతో ఆ హీరోయిన్స్ వ్యభిచారం చేయడానికి ఒప్పుకుంటున్నారని పేర్కొంది. అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దవారే ఈ వ్యభిచారాలను ప్రోత్సహిస్తున్నారని లాస్య బాంబు పేల్చింది.

అమెరికాలో స్థిరపడిన తాము ఇక్కడ ఖర్చులు భరించలేక పొదుపు చేయలేక సతమతం అవుతున్నామని.. కానీ ఇండియా నుంచి వచ్చే పెద్ద హీరోయిన్స్ - చిన్న హీరోయిన్లు - నటీనటులు నెలల తరబడి ఇక్కడ ఉండడానికి వారు వ్యభిచారం చేయడమే కారణమని లాస్య చెప్పుకొచ్చింది. ‘వాళ్ల సొంత ఖర్చుతో ఇక్కడకు రారు. మొదట ఈవెంట్స్ కోసం వచ్చిన హీరోయిన్లని షాపింగ్ కు వస్తారా అని పిలుస్తారు. వాళ్లు ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో హీరోయిన్స్ కు తెలుసు. అయినా వెళతారు.. ఎందుకంటే వారికి వ్యభిచారం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి..’ అని లాస్య సంచలన నిజాలు చెప్పింది.

తాను అమెరికాలో జరిగే తెలుగు ఈవెంట్స్ కు అస్సలు వెళ్లనని.. కారణం ఇలా చెత్త వెధవలు అలాంటి కమిట్ మెంట్స్ కావాలని తనను కూడా అడిగారని లాస్య వాపోయింది. అంతేకాదు లాస్య మరో బాంబు పేల్చింది. తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో చేస్తోందని.. ఆమె ఇటీవల అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెలరోజులు ఇక్కడే ఉందని తెలిపింది. ఈ సమయంలో ఆమె వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించిదని వెల్లడించింది. 80 లక్షలు ఆమె సినిమా రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ అని తెలిపింది. అంతేకాదు.. ఈ విషయాన్ని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసి గొప్పలు చెప్పుకుందంటూ వివరించింది..

ఇక తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ పెద్దమనిషి నాకు ఫోన్ చేసి ఆ ఉద్దేశంతో అడిగాడు. చాలా ఉన్నతస్థాయి వ్యక్తి ఆయన. దానికి నేను కుదరదని చెప్పేశాను అని లాస్య తెలిపింది. ‘నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు. నువ్వెంత అఫ్ట్రాల్’ అని తనతో మాట్లాడాడని పట్టరాని కోపంతో లాస్య తెలిపింది. ఈవెంట్ కోసం వచ్చిన హీరోయిన్లు అక్కడ కొద్దిసేపు ఉండి హోటల్ రూంకు వెళ్లిపోతారని.. అక్కడ వాళ్లను చాలా మందితో కలిసి ఇదే పనిచేస్తారని లాస్య సెక్స్ రాకెట్ ను బయటపెట్టింది. ఆ రాత్రి ఎంతమంది పోయారనే విషయాన్ని కూడా తన స్నేహితులు చర్చించుకుంటారని తెలిపింది.

తాను అలాంటి కమిట్ మెంట్లకు లొంగను కనుకే అమెరికాలో ఉన్నా తనను ఈవెంట్లకు పిలవడం మానేశారని..ఓ సారి పిలిస్తే తన కుటుంబసభ్యులతో వెళ్లినందుకు ఫీల్ అయ్యారని.. అందుకే నేను రిఫర్ చేసిన వాళ్లను కూడా తీసుకోవడం లేదని’ లాస్య వాపోయింది. టాలెంట్ ఉన్నా కూడా ఇలా వారి చేతిలో నలిగిపోవడం ఇష్టం లేక కళాభిమానాన్ని చంపుకుంటున్నానని లాస్య తెలిపింది. తన భర్త కు కూడా ఇలాంటి విషయాలను పంచుకున్నానని వాపోయింది. ఆయన అర్థం చేసుకొని ఈవెంట్లకే వెళ్లనీయడం లేదని తెలిపింది.

ఇక ‘చికాగో సెక్స్ రాకెట్’ బయటపడడంతో టాలీవుడ్ ఉలిక్కింది. వెంటనే ‘మా’ అసోసియేషన్ జూన్ 24న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా అమెరికా దంపతులు టాలీవుడ్ హీరోయిన్లతో సెక్స్ రాకెట్ నడిపారనే విషయం దుమారం రేపడంతో ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి - యాంకర్ కమ్ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

*నన్నూ అడిగారు : అనసూయ

యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజా చికాగో సెక్స్ రాకెట్ నేపథ్యంలో స్పందించారు. ‘చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2016లో దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈవెంట్ కోసం వెళ్లాను. అప్పుడే శ్రీరాజ్ అనే వ్యక్తి ఓ ఈవెంట్ లో పాల్గొనాలని నన్ను సంప్రదించాడు. కానీ అతడు మాట్లాడిన పద్ధతి నచ్చక ఒప్పుకోలేదు. నేను తిరస్కరించినా కూడా నా ఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్ లో పాల్గొనడం లేదని అప్పట్లో ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపింది.

*పెద్ద హీరోయిన్లకు ఎక్కువే ఇస్తారు..: శ్రీరెడ్డి

చికాగో సెక్స్ రాకెట్ లో దొరికిన దంపతులు తనను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి తెలిపింది. ‘అవాకాశాల్లేని హీరోయిన్లను అమెరికాకు రప్పించి మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు 1000 అమెరికా డాలర్లు ఆఫర్ ఇస్తారు. ఈ ఆఫర్ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది’ అని శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడించింది.

ఇక ఈ ఘటనపై మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ స్పందించారు. ‘కిషన్ మొదుగుముడి నిర్వహించే వ్యవహారాలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ మేనేజర్ గా చేసినట్టున్నాడు. ఈవెంట్స్ ప్రదర్వన కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. ఈ ఉదంతంపై జూన్ 24న సమావేశం నిర్వహిస్తున్నాం’ అని శివాజీ తెలిపారు.