Begin typing your search above and press return to search.

మేము సైతం అంటున్న మంచు లక్ష్మి

By:  Tupaki Desk   |   5 Feb 2016 5:30 PM GMT
మేము సైతం అంటున్న మంచు లక్ష్మి
X
మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న సినిమాల్లోనే కాకుండా.. టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. సినిమాలు తీయడం నటించడంతో పాటే.. టీవీల్లో టాక్ షోలతోనూ సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకుంది. ప్రేమతో మీ లక్ష్మితో స్టార్ట్ చేసి - లక్కుంటే లక్ష్మి - దూసుకెళ్తా - బూమ్ బూమ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా డీల్ చేసిన అనుభవం ఉంది.

అలాగే ఈమెకు సామాజిక సేవపై కూడా మక్కువ ఎక్కువ. చెన్నై వరదల సయమంలో మేము సైతం అంటూ ఓ కేంపెయిన్ ను టాలీవుడ్ తరఫున నడపడంలో.. లక్ష్మీ మంచు కీలక పాత్ర పోషించింది. ఇదే కాకుండా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అనుభవం, మంచితనం ఆమె సొంతం. అందుకే ఓ ఎంటర్ టెయిన్ మెంట్ ఛానల్.. మేముసైతం అంటూ ప్రారంభించబోతున్న కార్యక్రమానికి తొలి ఆప్షన్ గా ఈమెనే ఎంచుకుంది. 'మీతో ఓ సూపర్బ్ న్యూస్ పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. త్వరలో మరో కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించనున్నాను. మేము సైతం అంటూ జెమినీ టీవీ నిర్వహించనున్న ప్రోగ్రాం త్వరలో ప్రారంభమవుతుంది' అంటూ ట్వీట్ చేసింది లక్ష్మీ మంచు.

ఈ కార్యక్రమం సోషల్ హెల్ప్ అనే కాన్సెప్ట్ పై ఉండనుందని సమాచారం. అయితే ఇప్పటివరకూ ప్రోమోస్ లాంటివి చేయకపోవడానికి కారణం హోస్ట్ ని ఎంపిక చేయకపోవడమే. ఇప్పుడు మంచు వారసురాలిని ఈ బాధ్యతలకు ఎంపిక చేయడంతో.. త్వరలో ఈ ప్రోగ్రాంకి సంబంధించిన డీటైల్స్ అనౌన్స్ చేయనున్నారు.