Begin typing your search above and press return to search.

టైగర్ తో లచ్చిందేవి ఢీ!

By:  Tupaki Desk   |   25 Nov 2015 5:30 PM GMT
టైగర్ తో లచ్చిందేవి ఢీ!
X
ఈ ఏడాది చివర్లో చిన్న సినిమాల పండుగ జరగబోతోంది. ఇన్నాళ్లు సరైన సమయం కోసం ఎదురు చూసిన లో బడ్జెట్టు సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి. ఈనెల 27న 'తను నేను' సినిమా రిలీజ్ అవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో శంకరాభరణం - రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 'కిల్లింగ్ వీరప్పన్'లాంటి సినిమాలతో పాటు.. మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుని రెడీగా వున్నాయి. వాటితో పాటు 'సైజ్ జీరో' - సూర్య నటించిన 'మేము' - రవితేజ 'బెంగాల్ టైగర్' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డిసెంబరు ద్వితీయార్థంలో కూడా నాగచైతన్య 'సాహసమే శ్వాసగా సాగిపో'.. ఆ తరువాత వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇలా డిసెంబరు నెలలో వరుసబెట్టి... చిన్న పెద్ద సినిమాలు రిలీజ్ కావడానికి రెడీ వుతున్నాయి.

పనిలో పనిగా జగదీష్ తలశిలా డైరెక్షన్ లో మయూఖ క్రియేషన్స్ లో తెరకెక్కిన 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' మూవీ కూడా డిసెంబరు 11న రిలీజ్ చేయడానికి చిత్రం బృందం డేట్ ను లాక్ చేసినట్టు తెలిసింది. ప్రముఖ దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. నవీన్ చంద్ర - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం.. మరి అంతకు ముందు రోజే రిలీజ్ అవుతున్న రవితేజ 'బెంగాల్ టైగర్' తాకిడికి ఎలా తట్టుకుంటుందనేది చూడాలి. లావణ్య త్రిపాఠి ఇందులో గయ్యాళి పాత్రలో కనిపించబోతోంది. ఆడియో ఆవిష్కరణ కూడా పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా వుంది చిత్ర యూనిట్. భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమాతో లావణ్య త్రిపాఠి, త్రిపుర లాంటి ఫ్లాప్ మూవీతో నవీన్ చంద్ర ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' మూవీ... ఏమాత్రం 'బెంగాల్ టైగర్'తో పోటీ పడుతుందో వేచి చూడాలి!