Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: క్షణ క్షణం ఉత్కంఠే

By:  Tupaki Desk   |   10 Feb 2016 10:07 AM GMT
ట్రైలర్ టాక్‌: క్షణ క్షణం ఉత్కంఠే
X
అడివి శేష్‌ - అనసూయ - అదా శర్మ ప్రధాన తారాగణంతో రూపొందిన సినిమా ''క్షణం''. ఈ సినిమా ట్రైలర్‌ ను ఈరోజే మహేష్‌ బాబు - సమంత రిలీజ్‌ చేశారు. పదండి ఓసారి చూద్దాం.. ఈ ట్రైలర్‌ ఎలా ఉందో.

నూతన దర్శకుడు రవికాంత్ పేరేపు.. ఇతగాడు తీసిన సినిమా ''క్షణం''. ట్రైలర్‌ అనుక్షణం చాలా ఉత్కంఠగా ఉందనే చెప్పాలి. ఎక్కడో ఫారిన్‌ లో ఉన్న హీరో అడివి శేష్‌.. తన మాజీ ప్రియురాలు అదా శర్మ కూతురు మిస్సింగ్‌ అని ఫోన్‌ చేయడంతో.. సాయం చేయడానికి ఇండియా వస్తాడు. ఇలా వచ్చాడో లేదో.. వెంటనే మనోడి మీద ఎటాక్‌ షురూ అవుతుంది. అసలు నిజంగా ఆమెకు కూతురు ఉందా లేదా అనేంత సందేహం అందరూ క్రియేట్‌ చేస్తుంటారు. ఇంతకీ ఏమైంది అని తెలుసుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ అనసూయ మనోడికి సాయం చేస్తుంది. రెండు నిమిషాల పాటు చాలా థ్రిల్లింగ్‌ గా ఉందీ క్షణం ట్రైలర్‌.

చూస్తుంటే చాన్నాళ్లకు పివిపి బ్యానర్‌ లో ఒక హిట్టు సినిమా పడుద్దేమో అనే అనిపిస్తోంది మరి.