Begin typing your search above and press return to search.

రమ్యతో విడాకులు.. చదివి వినిపిస్తా

By:  Tupaki Desk   |   31 July 2016 4:43 AM GMT
రమ్యతో విడాకులు.. చదివి వినిపిస్తా
X
అనేకసార్లు తెలుగు మీడియాలో వచ్చే ఒక రొటీన్ న్యూస్ ఏంటంటే.. దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ రమ్యకృష్ణ.. భర్తతో గొడవలుపడి విడాకులు తీసుకున్నారని. అలా రూమర్లు పుట్టిన ఓ నెల్లాళ్లకు మనోళ్లు ఏ తిరుపతి గుడిలోనో తమ కొడుకుతో కలసి కనిపిస్తుంటారు. రూమర్లు సర్దుకుంటాయి. మళ్లీ కొన్నాళ్ళకు మళ్ళీ వినిపిస్తాయి. ఇవన్నీ వింటుంటే అసలు వాళ్ళకు ఎలా అనిపిస్తుంది?

''సీరియస్‌ గా తీసుకోం. ఏం న్యూస్ దొరికినట్టు లేదు మాపై పడ్డారనుకుంటా. రమ్యకు తెలుగు రాదు కాబట్టి.. నేనే చదివి వినిపిస్తా. ఆమె అవునా? అంటూ కూల్ గా వాటన్నింటినీ వింటూ ఉంటుంది'' అంటున్నారు కృష్ణవంశీ. మరి బయట ఇద్దరూ కలసి ఎప్పుడూ పెద్దగా కనిపించరేంటి మాష్ఠారూ? అలా కనిపిస్తే అసలు ఇలాంటి రూమర్లు రావు కదా అంటే.. ''నేనంత అవుట్‌ డోర్ మనిషిని కాదు. కొంచెం షై పర్సనాలిటీ నేను. భార్యభర్తల అనుబంధం అనేది పది మందికి చూపించే పబ్లిక్ డిస్‌ ప్లే కాదుగా. మేమిద్దరం జనాలకు భయపడి బతికేవాళ్లం కాదు. ఇద్దరం కలసి కనిపించి చాలా రోజులైంది, జనాలు ఏమనుకుంటారో? అనే థాట్ అస్సలు రానే రాదు మాకు'' అంటున్నారాయన.

‘శ్రీ ఆంజనేయం’ సినిమాకనే కాదు.. ఇప్పటివరకూ రమ్యది ఒక్క పైసా కూడా నేను తీసుకోలేదు. ఈ విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను పట్టించుకోను. నేను తన డబ్బులు తీసుకోలేదు కాబట్టే మా జీవితం హాయిగా సాగుతోంది. ఆవిడ డబ్బులు ముట్టుకున్న మరుక్షణం నేను చనిపోయినట్లే. ఆ పరిస్థితి ఇప్పటివరకూ రాలేదు. ఎప్పటికీ రాదు కూడా’’ అని కృష్ణవంశీ చెప్పాడు.

అసలు మీ లవ్‌ స్టోరీ గురించి ఏమైనా చెప్తారా బాబూ అంటే.. ''కొన్ని అమ్మే విషయాలుంటాయి. కొన్ని అమ్మకూడని విషయాలుంటాయి. కొన్ని అమ్మరానివి ఉంటాయ్. దిసీజ్ నాట్ ఫర్ సేల్'' అంటూ నవ్వేశారు కృష్ణవంశీ.