Begin typing your search above and press return to search.

ఒకరు కాదు ఇద్దరే ముద్దని తేల్చేశాడా?

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:12 PM GMT
ఒకరు కాదు ఇద్దరే ముద్దని తేల్చేశాడా?
X
అగ్ర హీరోల సినిమా అంటే చాలు కనీసం ఇద్దరు భామలతోఆడిపాడేయటం ఒక అలవాటు. ఆ మధ్యన వచ్చిన మార్పుతో వీలైనంతవరకూ ఒకే భామతో సర్దుకుపోతున్నారు. మధ్య మధ్యలో కథ డిమాండ్ చేస్తే తప్ప ఇద్దరిని స్క్రీన్ మీద తీసుకురావట్లేదు. మొన్నటికి మొన్న శ్రీమంతుడులో ఒకే భామతో సర్ది చెప్పుకున్న మహేశ్.. ఆ తర్వాత బ్రహ్మోత్సవంలో ఇద్దరు భామలతో సందడి చేశాడు. ఇప్పుడు ఏఆర్ మురుగుదాస్ తో చేస్తున్న సినిమాలో ఒక్కరితో ఓకే అనేశాడు.

వచ్చే ఏడాది జనవరిలో కొరటాల దర్శకత్వంలో చిత్రానికి ఓకే చెప్పేసిన మహేశ్.. ఈ సినిమాలో మాత్రం ఇద్దరు కథానాయకులు ఉంటాని చెబుతున్నారు. కథానుగుణంగా ఇద్దరు భామల అవసరం ఉండటంతో మహేశ్ ఓకే చెప్పారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చిత్ర పరిశ్రమ వర్గాల మాట మాత్రం మరోలా ఉంది. కొరటాలకు ఇద్దరు భామలైతే కలిసి వస్తుందన్న సెంటిమెంట్ ఉందని.. అతగాడు చేసిన మిర్చిలోనూ.. జనతాగ్యారేజ్ లోనూ ఇద్దరు భామలు ఉన్నారని.. అందుకే అదే సెంటిమెంట్ ను తన తాజా చిత్రంలోనూ కంటిన్యూ చేయనున్నట్లుగా చెబుతున్నారు. చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లు మామూలే కానీ.. హీరోయిన్ల విషయంలోనూ ఇలాంటివి ఉంటాయంటారా..?