Begin typing your search above and press return to search.

​మహేశ్ తో పని చేయడం నా డ్రీమ్

By:  Tupaki Desk   |   12 Aug 2017 4:57 AM GMT
​మహేశ్ తో పని చేయడం నా డ్రీమ్
X
ఇప్పుడిప్పుడే వస్తున్న ఒక హీరోయిన్ మీరు ఏ హీరో తో నటించాలి అనుకుంటున్నారో అని అడిగితే చెప్పిన ఆ ఒకటి రెండు పేర్లులో కచ్చితంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు ఉంటుంది. మన సౌత్ ఇండియాలోనే టాప్ హీరోలలో ఒకడైన మహేశ్ బాబు ఇప్పుడు అందరి అమ్మాయిల కలల రాకుమారుడు గా మారాడు. కొన్ని పెద్ద సినిమాలు అనుభవం గాని లేదా అదిరిపోయే అందంగాని ఉంటే తప్ప మహేశ్ బాబు పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం రాదు ఏ అమ్మాయికి. కానీ ఇప్పుడు హిందీలో ఓ రెండు సినిమాలు చేసి సరాసరి తెలుగు సూపర్ స్టార్ మహేశ్ తో ఒక కొత్త హీరోయిన్ నటిస్తుంది. ఈ అవకాశం వచ్చినందుకు ఆ హీరోయిన్ ఆనందంతో ఏమి అన్నది అంటే.

ఎమ్ యెస్ ధోని సినిమాలో నటించిన కియారా అద్వాని మహేశ్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కియారా అద్వాని మాట్లాడుతూ “మహేశ్ బాబుతో చేయడం నా ఫిల్మ్ కెరియర్లోనే నాకు దక్కిన గొప్ప అవకాశం. నేను ఎంత సంతోషంగా ఉన్నానో మీకు నేను చెప్పలేను. నా కల ఇంత తొందరగా నెరవేరుతుంది అని నేను అనుకోలేదు అని చెబుతుంది. పైగా నా మొదటి తెలుగు సినిమా మహేశ్ బాబుతో అవ్వడం మరింత ఆనందంగా ఉంది. కొరటాల శివ డైరక్షన్ లో మహేశ్ ఇప్పటికే సూపర్ హిట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది అని నేను మీకు చెప్పగలను. తెలుగు ప్రజల పండుగైన సంక్రాంతికి ఈ సినిమా విడుదలకాబోతుంది'' అని చెప్పింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు వేగంగా జరుగుతుంది.

‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్‌ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు అని తెలిసిందే. ఇందు కోసం సెట్ వేసి అసెంబ్లీ కూడా నిర్మించారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మరో ముఖ్య పాత్రలలో ప్రకాశ్‌ రాజ్‌ - శరత్‌ కుమార్‌ కూడా నటిస్తున్నారు.