Begin typing your search above and press return to search.

రామ్ శైలజతో నేరం చేస్తున్న సందీప్

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:30 PM GMT
రామ్ శైలజతో నేరం చేస్తున్న సందీప్
X
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప్రస్తుతం నేను శైలజ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మళయాళ భామ కీర్తి సురేష్ నాయికగా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతోన్న దశలో ఉండగానే.. టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ ఈ అమ్మడి తలుపు తట్టింది. అది ఆమె నేటివ్ లాంగ్వెజ్ అయిన మళయాళ మూవీకి రీమేక్ కావడం విశేషం.

మళయాళ హిట్ మూవీ నేరంను.. తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అనిల్ కన్నెగంటి డైరెక్షన్ వహించనున్న తెలుగు నేరంలో.. హీరోగా కుర్రహీరో సందీప్ కిషన్ ని తీసుకోగా.. హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం మళయాళ, తమిళ మూవీల్లో సత్తా చాటుతున్న కీర్తి సురేష్ ను, మరోవై ఆష్ణ జవేరీని సంప్రదిస్తున్నారు. అయితే.. వీరిలో కీర్తి సురేష్ నే పైనల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒక సంఘటన కారణంగా ఒక రోజులో సంభవించిన పరిస్థితులే ఈ మూవీ స్టోరీ. థ్రిల్లర్ తరహాలో ఉండే ఈ చిత్రం.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగుల్చుతుంది అంటున్నారు మేకర్స్.

ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేష్ తో టాక్స్ ఫైనల్ దశలో ఉన్నాయి. తెలుగు వెర్షన్ కి ఇంకా టైటిల్ డిసైడ్ చేయాల్సి ఉండగా.. డిసెంబర్ 12 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలన నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక పూర్తయిపోయిందని నిర్మాతలు చెబ్తున్నారు.