Begin typing your search above and press return to search.

స్టేషన్ లో 'కత్తి' లాంటి ఫ్లాష్ మాబ్

By:  Tupaki Desk   |   31 Aug 2016 12:19 PM GMT
స్టేషన్ లో కత్తి లాంటి ఫ్లాష్ మాబ్
X
సినిమాలు తీయడం కళ అయితే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం అంతకంటే పెద్ద ఆర్ట్. మూవీస్ తీసే విషయంలో అన్ని భాషల మేకర్స్ కి ట్యాలెంట్ ఉంటుంది కానీ.. దాన్ని ప్రమోట్ చేసుకోవడంలోనే బాలీవుడ్ అగ్రస్థానంలో ఉంటుంది. కౌంట్ విషయంలో తప్ప టాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలు కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ తో వెనకబడిపోతుంటాయి. అందుకు కారణం ఏంటో.. రీసెంట్ గా జైపూర్ లో జరిగిన ఓ సంఘటన చూస్తే అర్ధమవుతుంది.

పింక్ సిటీ జైపూర్ రైల్వే స్టేషన్ అది. అక్కడ దిగిపోయిన బార్ బార్ దేఘో హీరో హీరోయిన్లయిన సిద్ధార్ద్ మల్హోత్రా-కత్రినా కైఫ్ లు సడెన్ గా డ్యాన్స్ అందుకున్నారు. ఇప్పటికే విపరీతంగా పాపులర్ అయిన 'కాలా చెష్మా' సాంగ్ కు డ్యాన్స్ వేసేశారు. చుట్టుపక్కల చూస్తున్న జనాలు ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ముందు స్టన్ అయిపోయినా.. తర్వాత వాళ్లకు ఇది ప్లాష్ మాబ్ అనే విషయం అర్ధమయ్యి.. వారు కూడా కాళ్లు కదిపారు.

కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్ తో రైల్వే స్టేషన్ లో ఫ్లాష్ మాబ్ చేయించడమంటే చిన్న విషయం కాదు. అందుకే ఈ ఇన్సిడెంట్ ఇప్పడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బాలీవుడ్ స్టయిల్ ప్రమోషన్స్ అంటే అవే. ఏకంగా స్టార్ హీరోయిన్ తో రైల్వే స్టేషన్ లో ఫ్లాష్‌ మాబ్ పేరుతో చిందులు వేయించేశారుగా.