Begin typing your search above and press return to search.

మామతో అయ్యింది ఇప్పుడు అల్లుడితో

By:  Tupaki Desk   |   23 Feb 2019 5:55 AM GMT
మామతో అయ్యింది ఇప్పుడు అల్లుడితో
X
విలక్షణమైన సినిమాలతో సౌత్ లో అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మొన్న సంక్రాంతికి రజనికాంత్ కి పేట రూపంలో మంచి హిట్టే ఇచ్చాడు . తెలుగులో డిజాస్టర్ అయినప్పటికీ తమిళ్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ ని లాభాల్లోకి తీసుకెళ్ళింది. కమర్షియల్ సినిమాను సైతం తాను ఎంత బాగా డీల్ చేయగలనో రుజువు చేసుకున్న కార్తీక్ సుబ్బరాజ్ నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ధనుష్ తో చేయబోయే మూవీకి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న కార్తీక్ దీన్ని వైనాట్ బ్యానర్ లో రూపొందించబోతున్నాడు. అయితే ఇదేదో రొటీన్ మసాలా జానర్ కాదు. ఏదో వినూత్నమైన కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా రూపొందించేలా కార్తీక్ కథను సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో మరో ప్రత్యేకత ఉంది

షూటింగ్ దాదాపుగా మొత్తం యుఎస్ లోనే చేయబోతున్నారు. అంతే కాదు విఖ్యాత హాలీవుడ్ నటులు అల్ ప్యాసినోని ఇందులో నటింపజేసేందుకు కార్తిక్ విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఆలస్యం వెంటనే షూటింగ్ మొదలు పెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అసురన్ షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ అది పూర్తయ్యాక దీంతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత మావయ్య రజనికి కమర్షియల్ హిట్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ అంటే ధనుష్ కు సైతం మంచి ఇంప్రెషన్ ఉంది. తనకూ అంతకు మించిన సినిమా ఇస్తాడని ఆశపడటంలో తప్పు లేదుగా