Begin typing your search above and press return to search.

కరీనా ఎప్పటికీ చేయనంటోంది

By:  Tupaki Desk   |   19 May 2018 5:03 AM GMT
కరీనా ఎప్పటికీ చేయనంటోంది
X
ఈ రోజుల్లో హీరోయిన్లలో చాలామంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్లే. అప్ కమింగ్ హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారానే వీలైనంత పాపులారిటీ పెంచుకోవాలని చూస్తున్నారు. కాకపోతే సీనియర్ హీరోయిన్లు కొందరు సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా కొద్ది రోజుల క్రితమే ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది.

బాలీవుడ్ లోని మరో సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ మాత్రం ఈ విషయంలో ససేమిరా అంటోంది. తాను సోషల్ మీడియాలోకి అడుగుపెట్టను కాక పెట్టను అంటోంది. ఎందుకని అడిగి నా లైఫ్.. నా ఇష్టం అనేస్తోంది. ‘‘నా లైప్ లో జరిగే చాలా ఇన్సిడెంట్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. వాటిలో చాలావరకు నేనూ చూస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు పోస్టులు.. ఫొటోలు పెడుతూ కూర్చోవడం నా వల్ల అయే పనికాదు’’ అంటూ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చేసింది. కరీనాను సోషల్ మీడియాలో యాక్టివ్ మెంబర్ చేయాలని ఆమె ఫ్రెండ్.. వీరే ది వెడ్డింగ్ లోని ఇంకో హీరోయిన్ సోనమ్ కపూర్ మాత్రం ఇంకా ట్రయ్ చేస్తూనే ఉంది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే హీరో సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసింది కరీనా కపూర్. తరవాత కొడుకు తైమూర్ కు జన్మనివ్వడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తిరిగి ఇప్పుడు వీరే ది వెడ్డింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. నలుగురు ప్రాణస్నేహితులైన అమ్మాయిల జీవితంలోని సంఘటనలతో ఈ మూవీ వస్తోంది.