Begin typing your search above and press return to search.

శ్రీదేవి ప్రథమ వర్థంతి ఇక్కడే..!

By:  Tupaki Desk   |   9 Feb 2019 10:44 AM GMT
శ్రీదేవి ప్రథమ వర్థంతి ఇక్కడే..!
X
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి అప్పుడే సంవత్సరం కాబోతుంది. ఆమె మరణంను ఇంకా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆమె మరణం నుండి తేరుకోనట్లుగానే కనిపిస్తున్నారు. భర్త బోణీ కపూర్‌ మరియు కుమార్తెలు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా శ్రీదేవి గురించి మాట్లాడి కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నారు. దుబాయిలో శ్రీదేవి హార్ట్‌ ఎటాక్‌ తో మృతి చెంది ఈనెల 24కు సంవత్సరం కాబోతుంది. ఈ నేపథ్యంలో మొదటి వర్థంతిని గ్రాండ్‌ గా నిర్వహించేందుకు కపూర్‌ ఫ్యామిలీ నిర్ణయించింది.

శ్రీదేవికి అత్యంత ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటి సౌత్‌ లోని చెన్నై. బాలీవుడ్‌ వెళ్లినా కూడా శ్రీదేవికి సౌత్‌ పై మమకారం పోలేదు. అందుకే ఆమె ఇక్కడకు తరచు వస్తూనే ఉండే వారు. చెన్నైలో శ్రీదేవికి పెద్ద ఇల్లు కూడా ఉంది. అందుకే శ్రీదేవి మొదటి వర్థంతిని చెన్నైలోని ఆమె ఇంట్లో నిర్వహిస్తే బాగుంటుందని బోణీ కపూర్‌ నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలు పెట్టించాడట. చెన్నైలో ఉన్న శ్రీదేవి ఇంటిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

చెన్నైలో జరుగబోతున్న శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమంకు కపూర్‌ కుటుంబ సభ్యులతో పాటు తమిళ సినీ, రాజకీ ప్రముఖుల మరియు బాలీవుడ్‌ - టాలీవుడ్‌ నుండి కూడా కొందరు గెస్ట్‌ లు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీదేవి వర్థంతిని ఇక్కడ నిర్వహించేందుకు బోణీ కపూర్‌ నిర్ణయించుకోవడంతో సౌత్‌ లోని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.