Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మళ్లీ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు

By:  Tupaki Desk   |   25 Nov 2015 11:30 AM GMT
ఎన్టీఆర్ మళ్లీ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు
X
నటన ఎన్టీఆర్ కు ఫుల్ టైం అయితే.. పార్ట్ టైంగా అప్పుడప్పుడూ పాటలు పాడేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ‘యమదొంగ’ సినిమాలో ఓలమ్మీ తిక్కరేగిందా పాట కోసం తొలిసారి గొంతు సవరించుకున్న ఎన్టీఆర్.. ఆ తర్వాత ‘కంత్రి’ టైటిల్ సాంగ్ - ‘రభస’లోని రాకాసి రాకాసి పాటతో అభిమానుల్ని బాగానే మెప్పించాడు. ఇప్పుడు జూనియర్ మరోసారి తన సింగింగ్ టాలెంటుతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు సమాచారం. తన కొత్త సినిమా ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ ఓ మాస్ నంబర్ పాడబోతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం తన యూనిట్ సభ్యులతో కలిసి స్పెయిన్ షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు తారక్. ఈ షెడ్యూల్ ముగించుకుని డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్ రాబోతున్నాడు. రాగానే దేవిశ్రీ స్టూడియోకు వెళ్లి పాట పాడేయడమేనట. మిగతా పాటలన్నీ ఇప్పటికే పూర్తి చేసిన దేవి.. ఎన్టీఆర్ పాటను మాత్రం పెండింగులో పెట్టాడట. ఎన్టీఆర్ సింగేయగానే ఆడియో రెడీ అయిపోతుంది, డిసెంబరు 13న ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇందులో సుకుమార్-దేవిశ్రీ మార్కు ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. అందులో ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోతాయని అంటుంటడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా ఓ సాంగ్ అందుకున్నాడంటే ఇక వారి ఆనందం రెట్టింపవబోతున్నట్లే.