Begin typing your search above and press return to search.

శ్రీదేవిని మించిపోయేలా ఉన్నారు

By:  Tupaki Desk   |   21 Oct 2017 6:07 AM GMT
శ్రీదేవిని మించిపోయేలా ఉన్నారు
X
భారతదేశ చలన చిత్రం రంగంలో ఎంతో మంది అందమైన హీరోయిన్లు తెరపై కనిపించారు. వారిలో శ్రీదేవి ఒకరు. అందమైన సోసగసుతో వెండితెరని ఏలిన శ్రీదేవి సినిమాలు ఇప్పటికి కూడా చాలా ఫెమస్ అని చెప్పాలి. ప్రముఖ హీరోలు - దర్శక నిర్మాతలకు కూడా ఆమె ఫేవరేట్ హీరోయిన్. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అయితే పడి చస్తారన్న విషయం అందరికి తెలిసిందే.

అయితే ఆమె ప్రస్తుతం కొన్ని డిఫరెంట్ సినిమాలతో అప్పుడపుడు ప్రేక్షకులను పలకరిస్తోంది. అయితే త్వరలో ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి వారి కూతుళ్లు రాబోతున్నారు. జాహ్నవి కపూర్ - ఖుషి కపూర్ ఇద్దరు తల్లిని మించిన అందంతో అందరిని ఆకరిషిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఇప్పటికే పెద్దకూతురు జాహన్వి బాలీవుడ్‌ లో ఒక మూవీతో బిజీగా ఉందని అలాగే ఖుషీ కూడా అక్క తర్వాత మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

రీసెంట్ గా దీపావళి సందర్భంగా అక్కచెల్లెలు దిగిన ఫొటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఇద్దరు ఇచ్చిన స్టిల్స్ చాలా సెక్సీ గా ఉన్నాయి. చూస్తుంటే బాలీవుడ్ లో శ్రీదేవి కంటే ఎక్కువ స్థాయిలోనే క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నారు అనే విధంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సినిమాల్లోకి ఎప్పుడు అడుగుపెడుతున్నారని కూడా మూవీ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.