Begin typing your search above and press return to search.

ఆ వల్గర్ కామెడీ నావల్ల కాదని చెప్పేసిందట!

By:  Tupaki Desk   |   13 April 2019 2:10 PM GMT
ఆ వల్గర్ కామెడీ నావల్ల కాదని చెప్పేసిందట!
X
ఈమధ్య తెలుగు టెలివిజన్ లో ఎన్నో షోలు వచ్చినా వాటన్నిటిలో మోస్ట్ సక్సెస్ ఫుల్ షో జబర్దస్త్. మొదటి నుంచి భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ షోకు నాగబాబు.. రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రష్మి.. అనసూయలు కూడా ఈ షోకు యాంకర్లుగా మంచి గుర్తింపు సాధించారు. ఎంతో మంది కమెడియన్ల ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. వారిలో కొందరికి సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి.

ఒకవైపు ఇలా ఉంటే మరోవైపు ఈ షోలో ఉన్న అడల్ట్ కంటెంట్ జోకులపై విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఆ విమర్శలతో సంబంధం లేకుండా జబర్దస్త్ తెలుగులో నెంబర్ వన్ షో గా కొనసాగుతోంది. ఈమధ్య నాగబాబు నరసాపురం ఎంపీ సీటుకు జనసేన తరపున పోటీ చేయడం.. మరోవైపు రోజా నగరి సీటుకు ఎంఎల్ఏగా వైసీపీ తరఫున పోటీ చేయడంతో వారికి బదులుగా సీనియర్ నటి మీనా.. శేఖర్ మాస్టర్ లను జడ్జిలుగా తీసుకున్నారు.

వీరిని ఫైనలైజ్ చేసే ముందు 'జబర్దస్త్' నిర్వాహకులు పలువురు నటీనటులను సంప్రదించడం జరిగిందట. అలానే సీనియర్ నటి జయసుధను కూడా సంప్రదించారట. కానీ ఆమె జబర్దస్త్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ఇలాంటి వల్గర్ కామెడి షో తనకు సూట్ కాదని.. తన నుంచి ప్రేక్షకులు ఇలాంటివి ఆశించరనే ఉద్దేశంతో నో చెప్పిందట. పాపులర్ షో అయినా.. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా ఇలా వద్దని చెప్పడం నిజంగా సర్ ప్రైజే. సహజనటిగా పేరుతెచ్చుకున్న జయసుధ గత కొన్నేళ్లుగా హీరో.. హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తున్నారు. సున్నితమైన భావోద్వేగాలు ఉండే పాత్రల్లో నటిస్తూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న జయసుధ నిర్ణయం సరైనదనేనని ఆమె అభిమానులు అంటున్నారు.