Begin typing your search above and press return to search.

1 డైరక్టర్.. 3 హీరోయిన్లు.. 25 కోట్ల బిజినెస్

By:  Tupaki Desk   |   22 Jun 2017 11:05 AM GMT
1 డైరక్టర్.. 3 హీరోయిన్లు.. 25 కోట్ల బిజినెస్
X
''జయ జానకి నాయక'' అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ వస్తున్నంత మాత్రాన.. ఇంకా పెద్దగా మార్కెట్ అనేదే లేని ఈ హీరో సినిమాను ఎగబడి ఎవ్వరూ కొనేయారు. కాని ఇక్కడ మాత్రం.. దిల్ రాజు వంటి పెద్దలు ఈ సినిమాపై పెద్ద బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక 25 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ అయ్యిదంటే చూసుకోండి. అయితే అందుకు కారణం వేరే అనే చెప్పాలి.

ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరక్ట్ చేస్తున్నాడు కాబట్టి.. ఎక్కడి లేని క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా మనోడు సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ కొట్టాక చేస్తున్న సినిమా కాబట్టి.. ఖచ్చితంగా విపరీతమైన క్రేజ్ ఉండనే ఉంది. అంతటితో ఆగకుండా.. ఈ సినిమా కోసం ఏకంగా టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ను మెయిన్ లీడ్ గా దించారు. ఈమెతో సరిపెట్టకుండా.. ప్రగ్యా జైస్వాల్ ను కూడా మరో హీరోయిన్ గా పట్టుకొచ్చారు. అయినా బోయపాటికి గ్లామరసం చాల్లేదేమో కాని.. వెంటనే మనోడు క్యాథరీన్ త్రెసాతో ఒక ఐటెం సాంగు కూడా చేయిస్తున్నాడు. కట్ చేస్తే.. బోయపాటి అండ్ హీరోయిన్స్ ఎఫెక్టుతో ఇప్పుడు సినిమాకు భారీ బేరాలే సెట్టయ్యాయ్. ఈ క్యాస్టింగ్ హంగులకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ప్లస్సయిందిలే.

ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజు ఇప్పుడు 9 కోట్లు ఇచ్చి దక్కించుకోగా.. సీడెడ్ ఏరియాను ఆల్రెడీ 7 కోట్లకు అమ్మేశారట. ఆంధ్ర ప్రాంతంలోని ఇతర ఏరియాల్లో మరో 7 కోట్లు లాగడం ఈజీయే అనిపిస్తోంది. అసలు ఈ రేంజు బిజినెస్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు కూడా షాకైపోతున్నాయి. మరి బోయపాటి ఈ ఇన్వెస్టుమెంటును ఎంతవరకు తిరిగి లాక్కొస్తాడు అనేదే అసలు ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/