Begin typing your search above and press return to search.

బెల్లంకొండ ఇంకా పెంచేస్తున్నాడుగా

By:  Tupaki Desk   |   20 Aug 2017 6:02 AM GMT
బెల్లంకొండ ఇంకా పెంచేస్తున్నాడుగా
X
మొదటి సినిమాతో కాస్త తడబడ్డా ఫైనల్ గా బెల్లం కొండ శ్రీనివాస్ "జయ జానకి నాయక" సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్నాడు. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. పోటీగా వచ్చిన రెండు సినిమాలకు ధీటుగా కలెక్షన్స్ రావడంతో బయ్యర్స్ ని సేఫ్ జోన్ లోకి తెస్తుంటి అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

అయితే పోటీగా వచ్చిన "లై" మరియు "నేనే రాజు నేనే మంత్రి" సినిమాల కంటే జయ జానకి నాయక లో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకోవడంతో బిసి సెంటర్లలో ఆడియెన్స్ చూడటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ రొమాన్స్ కి అలాగే హంసలదీవిలో తీసిన భారీ యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియెన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓ వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రేక్షకుడి అభిరుచి ప్రకారం బోయపాటి సినిమాను తెరకెక్కించడంతో పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులు తియేటర్స్ వరకు వస్తున్నారు. అందుకే ఇప్పుడు ధియేటర్లు పెంచుతున్నారు తెలుసా.

ఈవారం నుంచి ఆంద్రప్రదేశ్ - తెలంగాణ లోని బిసి సెంటర్లలో ఇంకా 100 స్క్రీన్స్ ని జయ జానకి నాయక సినిమా పెంచుకోనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి బరిలోకి దిగిన మూడు చిత్రాల్లో జయ జనాకి నాయక మాస్ లో గట్టిగా దూసుకుపోతోందని చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి వారంలో మంచి కలెక్షన్స్ ను రాబట్టిన బెల్లం కొండ రెండవ వారం కూడా ఇదే విధంగా రాబడితే సినిమాకు 25 కోట్లపైనే షేర్ రావడం ఖాయం అంటున్నారు పండితులు. చూద్దాం ఏమవుతుందో!!