Begin typing your search above and press return to search.

ధృవ్ సరసన జాన్వి కపూర్.. నిజమేనా?

By:  Tupaki Desk   |   10 Feb 2019 6:52 AM GMT
ధృవ్ సరసన జాన్వి కపూర్.. నిజమేనా?
X
కొన్ని సినిమాల వాలకమే అంత. హంగామా... రచ్చ లేకపోతే ఆ సినిమాలు నిజంగా జనాల్లోకి పూర్తిగా వెళ్లినట్టు కాదు. టాలీవుడ్ లో మాడరన్ క్లాసిక్ అనదగ్గ 'అర్జున్ రెడ్డి' కూడా అంతే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నుండే లిప్పులాకుల పై రచ్చ. 'చిల్ తాత' నుండి బోల్డ్ కంటెంట్ పై విమర్శలు అబ్బో ఒకటి కాదు. అయనా ఫైనల్ గా మాత్రం టాలీవుడ్ గర్వించదగ సినిమాగా నిలిచింది. ఇప్పుడు రీమేక్ ల వంతు.

ముఖ్యంగా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన తమిళ రీమేక్ మొదటి నుండి వార్తల్లో నానుతూనే ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే విమర్శలు వచ్చాయి. టీజర్.. ట్రైలర్ల పరిస్థితి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇక రిలీజ్ అవుతుంది అనుకునే సమయానికి నిర్మాతలు E4 ఎంటర్టైన్మెంట్స్ వారు అవుట్ పుట్ సరిగాలేకపోవడం తో సినిమాను స్క్రాప్ చేస్తున్నామని..మళ్ళీ ఫ్రెష్ గా మొదటి నుంచి సినిమాను షూట్ చేస్తామని ప్రకటించారు.

దీంతో ఈ సినిమాపై కోలీవుడ్లో జోరుగా స్పెక్యులేషన్స్ ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒకటి.. ఈ సినిమాకు బాల స్థానంలో గౌతమ్ మేనన్ ను తీసుకుందామని ఆలోచిస్తున్నారట. మరో వార్త ఏంటంటే ధృవ్ కు జోడీగా అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు.. బాలీవుడ్ హీరోయిన్ అయిన జాన్వి కపూర్ ను తీసుకుందామని సంప్రదింపులు జరుగుతున్నాయట. ఒకవేళ నిజమే అయితే జాన్వికి ఈ సినిమా కోలీవుడ్ ఎంట్రీ అవుతుంది. ఈ ప్రచారం సంగతేమో గానీ చాలామంది ఇది జరిగేపని కాదని కొట్టిపారేస్తున్నారు. జాన్వి ప్రతి సినిమా ఎంపికపై చాలా కసరత్తు జరుగుతుందని.. బోనీ కపూర్.. కరణ్ జోహార్ లాంటి వారు ఎంతో చర్చించి గానీ ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరని బాలీవుడ్ లో టాక్ ఉంది. అసలే నెగెటివిటీ ఫుల్ గా ఉన్న ఈ తమిళ రీమేక్ కు వారు 'ఓకే' అంటారా అనేది సందేహమేనని టాక్. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.