Begin typing your search above and press return to search.

ఈషా అంబానికి అత్తింటి వారి 450 కోట్ల గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   16 Nov 2018 5:06 AM GMT
ఈషా అంబానికి అత్తింటి వారి 450 కోట్ల గిఫ్ట్‌
X
రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహం డిసెంబర్‌ 12న ఆనంద్‌ పిరమిల్‌ తో జరుగబోతున్న విషయం తెల్సిందే. ఈ వివాహంకు ప్రపంచ ప్రసిద్ది చెందిన వ్యాపారవేత్తలు మరియు బాలీవుడ్‌ - హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా హాజరు కాబోతున్నారు. దేశంలోనే అత్యంత ధనికులు అయిన అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలు గా ఉంటుందా - అంచనాలకు తగ్గట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా నెల రోజులు వివాహానికి సమయం ఉండగానే హంగామా మొదలు అయ్యింది.

అంబానీ ఫ్యామిలీకి ఏమాత్రం తగ్గకుండా పిరమిల్‌ ఫ్యామిలీ కూడా తమ కోడలకు ఆహ్వానం పలికేందుకు సిద్దం అవుతున్నారు. ప్రపంచ కుబేరుడైనా అంబానీ కూతురు తమ ఇంటికి రాబోతున్న నేపథ్యంలో ఆమెకు అత్యంత ఖరీదైన భవనంను గిఫ్ట్‌ గా పిరమిల్‌ ఫ్యామిలీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ముంబయిలోనే అత్యంత ప్రముఖమైన భవనాల్లో గులీటా ఒకటి. ఆ భవనంను తమ కోడలు ఈషాకు పెళ్లి కానుకగా ఇచ్చేందుకు పిరమిల్‌ ఫ్యామిలీ రెడీ చేస్తున్నారు.

గులీటా భవనంను దాదాపు 450 కోట్లు పెట్టి వేలంలో పిరమిల్‌ ప్యామిలీ కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ భవనంకు మెరుగులు అద్దుతున్నారు. 50 వేలకు పైగా చదరపు అడుగుల్లో ఐదు అంతస్తుల్లో ఉండే ఈ భవనం అత్యంత ఆధునికతను జోడిచ్చి నిర్మాణం చేయడం జరిగింది. మొదటి అంతస్తులో విశాలమైన లాన్‌ మరియు ఓపెన్‌ ఎయిర్‌ - వాటర్‌ బాడీ - మల్టీ పర్పస్‌ గదులు ఉంటాయి. ఇక రెండు మూడు అంతస్తుల్లో విశాలవంతమైన బెడ్‌ రూంలు - అత్యంత సుందరమైన హాల్‌ లు ఉంటాయి. స్విమ్మింగ్‌ పూల్స్‌ - జిమ్‌ ఇంకా ఎన్నో సౌకర్యాలు ఈ భవనంలో ఉంటాయి. ఆనంద్‌, ఈషా దంపతులు ఈ భవనంలోనే కాపురం ఉండబోతున్నారు. పిరమిల్‌ ఫ్యామిలీ డిసెంబర్‌ 1న ఈ భవనంలో పూజలు నిర్వహించి గృహ ప్రవేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.