Begin typing your search above and press return to search.

జైసింహ ప్రొడ్యూసర్ మీద ఐటి దాడి

By:  Tupaki Desk   |   17 Jan 2018 8:27 AM GMT
జైసింహ ప్రొడ్యూసర్ మీద ఐటి దాడి
X
ఇప్పుడు సినిమాలను భారీ రేట్లకు అమ్మేశారనే న్యూస్ బయటకు వస్తే చాలు.. వెంటనే ఆయా ప్రొడ్యూసర్లపై ఇనకమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వారు చాలా కీలకమైన సమాచారన్ని బేస్ చేసుకుని.. గతంలో సరిగ్గా సినిమా రిలీజ్ కు ముందు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. పెద్ద సినిమాలను నిర్మించే అనిల్ సుంకర.. వంటి వారిపై ఐటి దాడులు చేశారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది.

అయితే ఈసారి రూటు మార్చి.. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడో.. రిలీజ్ కు ఒక రోజు ముందో కాకుండా.. రిలీజై కాస్త హిట్ టాక్ వచ్చాక దాడులు చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లున్నారు. నిర్మాత సి.కళ్యాణ్‌ తీసిన 'జై సింహ' సినిమాకు తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చినా కూడా.. పక్కనున్న సినిమాలన్నీ కూడా సరైన టాక్ తెచ్చుకోకపోవడంతో.. ఇప్పుడు జై సింహకు మంచి కలక్షన్లే వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి హ్యపీ మూమెంట్లో ఆ సినిమా నిర్మాతపై ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ లో ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఒకేసారి సి.కళ్యాణ్‌ ఆఫీస్ పైన మరియు ఇంట్లోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాను 25 కోట్లకు అమ్మేశారనే టాక్ ఉండడం.. అలాగే చాలా చోట్ల కలక్షన్లు బ్రహ్మాండంగా వస్తున్నాయన్న నేపథ్యంలో.. ఈ దాడులు ఆశ్చర్యకరంగా మారాయి.