Begin typing your search above and press return to search.

చైతూ హీరోయిన్ పై సోషల్ మీడియాలో దాడి!

By:  Tupaki Desk   |   31 Aug 2016 6:42 AM GMT
చైతూ హీరోయిన్ పై సోషల్ మీడియాలో దాడి!
X
ఆ సినిమాలో మీరు అద్భుతంగా చేశారు మేడం.. పర్టిక్యులర్ గా ఆ సెంటిమెట్ సీన్ లో మీ నటన మాకు కన్నీరు తెప్పించింది అని ఏ నటివద్ద అయినా ఎవరైనా అంటే.. అంతకు మించిన ఆనందం ఆమెకు మరొకటి ఉండదు. అయితే ఇదే సీన్ రివర్స్ లో జరిగితే.. ఆ నటిపరిస్థితి కూడా అదేస్థాయిలో దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ దారుణ పరిస్థితులనే ఫేస్ చేస్తుంది మంజిమా మోహన్. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా చేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో హీరోయిన్ అయిన మంజిమ.. మళయాళంలో నటించిన చిత్రం ఒరు వడక్కం సెల్ఫీ. ఈ సినిమా విడుదల అయ్యాక ఆమెకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయట.

"నువ్వు సినిమాలు మానేయ్యి - నీకు నటనరాదు - సెంటిమెంట్ సీన్స్ లో నీ నటన మాకు నవ్వు తెప్పిస్తుంది" అని మంజిమా మోహన్ పై కామెంట్స్ వినిపిస్తున్నాయట. ఈ మేరకు ఒరు వడక్కం సెల్ఫీ చిత్రం విడుదలయిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో ఆమె నటనపై ఎటాక్ చేస్తున్నారట. ఈ విషయాలను చెప్పుకుని బాదపడుతుంది మంజిమా మోహన్. ఈ సినిమాలో ముఖ్యంగా సెంటిమెంట్ సీక్వెల్ లో ఆమె నటన నవ్వు తెప్పించిందనేది సోషల్ మీడియాలో ట్రోల్ చేసినవారి తాజా ఆరోపణ.

ఇలా ఆ సినిమాలో ఫలానా సన్నివేశంలో నువ్వు సరిగ్గా చేయలేదని, నీ ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ఏమాత్రం పలకలేదని ఆమెపై దాడిచేస్తున్నారట. ఈ విషయంలో తను ఏం చేస్తానని, అది పూర్తిగా డైరక్టర్ బాధ్యత కదా అని, ఆయన తన నటనపట్ల తృప్తి చెందిన తర్వాతే సినిమా బయిటకు వస్తుందని, అలాంటప్పుడు ఇలా తనపై ఎటాక్ చేయటం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తూ... సోషల్ మీడియాలో ఉండేవాళ్లు ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే అయినా కూడా ఈ స్థాయిలో బిహేవ్ చేయటం పద్దతి కాదని చెప్పుకొస్తుంది. అలాగే.. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో అకౌంట్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టమైపోతోందని, అవి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతగా ఇబ్బంది కూడా పెడుతున్నాయని వాపోతుంది. పాపం మంజిమ బాదని అర్ధంచేసుకుని ఇకనైనా ఆ దాడి మానేస్తారని ఆమె ఆశ!