Begin typing your search above and press return to search.

భలే క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

By:  Tupaki Desk   |   24 March 2019 5:55 AM GMT
భలే క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
X
నిహారిక - రాహుల్ విజయ్ జంటగా నటించిన 'సూర్యకాంతం' మార్చ్ 29 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. నిన్న శనివారం నాడు హైదరాబాద్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈవెంట్లో చాలా తక్కువసేపే మాట్లాడినా ఒక విషయంపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

ఈమధ్య విజయ్ దేవరకొండ - నిహారిక పెళ్ళి చేసుకోబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని డైరెక్ట్ గా ప్రస్తావించకుండానే పరోక్షంగా నిహారిక సోదరుడిగా ఇక్కడికి వచ్చానని చెప్తూ రూమర్లకు చెక్ పెట్టాడు. 'నాగబాబు గారితో 'గీత గోవిందం' సినిమాలో కలిసి నటించాను. ఆ సినిమాలో నాది కొడుకు పాత్ర. మొదటిరోజు నన్ను కలిసి ఐదు నిముషాలు మాట్లాడిన తర్వాత 'నువ్వు మంచోడివేనయ్యా.. ఏదో అనుకున్నాను.. నువ్వు మంచోడివేనయ్యా' అన్నారు. అలామొదలైంది మా జర్నీ. ఆయన నాన్న లాగే అనిపించారు. ఆయనతో నటించడం ఒక మంచి ఎక్స్ పీరియన్స్. నాగబాబు గారు ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. వరుణ్ అమెరికాలో ఉన్నాడు.. చరణ్ అన్న కూడా కూడా అమెరికాలోనే ఉన్నాడు. అందుకే ఒక బిగ్ బ్రదర్ లాగా భావించి నిహారిక సినిమా ఈవెంట్ కు హాజరవుతున్నాను.' అన్నాడు

ఒక్కదెబ్బతో రూమర్లకు చెక్ పెట్టడమే కాదు మెగా ఫ్యాన్స్ ను కూడా ఇంప్రెస్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇలా చెప్పగానే నిహారిక కూడా విజయ్ కి 'థ్యాంక్ యూ' చెప్పింది. కానీ ఫీవర్ ఎఫెక్టో ఏమో కానీ విజయ్ మాత్రం కాస్త నీరసంగానే కన్పించాడు. 'సూర్యకాంతం' టీమ్ కు అల్ ది బెస్ట్ చెబుతూ సినిమా గుడ్ ఫన్ లాగా అనిపిస్తోంది.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపాడు. తనకు ఫ్రీ టికెట్ ఇచ్చారని.. సినిమా చూడాలనుకుంటున్నానని తెలిపాడు.