Begin typing your search above and press return to search.

ఒకమాట మీదకు మహేష్ నిర్మాతలు

By:  Tupaki Desk   |   20 Jun 2018 10:29 AM GMT
ఒకమాట మీదకు మహేష్ నిర్మాతలు
X
మహేష్ బాబు టాలీవుడ్ లో ఇప్పటికి 24 సినిమాలు పూర్తి చేసి 25వ మైలురాయి దగ్గరకు చేరాడు. ఇరవై అయిదో సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుందని అభిమాలనులంతా అంచనాల్లో ఉన్న టైంలో ఈ మూవీ లీగల్ గా చిక్కుముళ్లలో ఇరుక్కుంది. ప్రొడ్యూసర్ పివిపి ఇంతకుముందు మహేష్ తో సినిమా నిర్మించినప్పుడు భారీగా లాసెస్ వచ్చాయి. ఆ నష్టాన్ని కవర్ చేసేందుకు ఇంకో సినిమా చేస్తానని మహేష్ మాటిచ్చాడు.

ఇప్పుడు 25వ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయడానికి మహేష్ రెడీ అవడంతో పీవీపీకి కోపమొచ్చింది. దీనిపై లీగల్ గా ప్రొసీడవానికి రెడీ అయ్యారు. మరోవైపు ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా తీద్దామని వెయిటింగ్ లో ఉన్నాడు. ఆయన భారీ మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పటికి దానికి వడ్డీయే చాలా మొత్తం అవుతుందని లెక్క. దీంతో మహేష్ భార్య నమ్రత రంగంలోకి పీవీపీ - దిల్ రాజు - అశ్వనీదత్ లతో చర్చించింది. ఈ చర్చల్లో ముగ్గురూ ఒకమాట మీదకొచ్చారు. ఇందులో భాగంగా ముగ్గురు నిర్మాతలు సమంగా పెట్టుబడి పెట్టి లాభాలను అదే రేషియోలో పంచుకుంటారు. దీంతో పీవీపీ లీగల్ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసుకోనున్నారు.

సాధారణంగా మహేష్ ఈమధ్య మూవీకి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. దానికి బదులుగా లాభాల్లో షేర్ తీసుకుంటున్నాడు. 25వ సినిమాకు నిర్మాతలు ముగ్గురు ఉండటంతో తనకు అలవాటయిన పద్ధతిని పక్కనపెట్టి నామినల్ మొత్తం తీసుకుని సినిమా చేయబోతున్నాడు. ముగ్గురు నిర్మాతలు కలిసి తీసుకున్న ఇంకో డెసిషన్ ఏమిటంటే ప్రొడక్షన్ కాస్ట్ లిమిట్ లోనే ఉండాలని. రూ. 80 కోట్ల బడ్జెట్ తోనే సినిమా పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన చిన్నచిన్న ఇష్యూలపై మాట్లాడానికి ముగ్గురు నిర్మాతలు మరోసారి మీటింగ్ అవుతారు. మొత్తానికి మహేష్ 25వ సినిమాలో చాలా విశేషాలే ఉండేట్టున్నాయి.