మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'చిత్రలహరి' షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. లవ్ స్టొరీలను అందంగా తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ సినిమాను ఒక లవ్ స్టొరీగానే రూపొందిస్తున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవడం కామనే కానీ.. అలా ఫిక్స్ అయిన వారందరికీ కిషోర్ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాడట.
ఆ సర్ ప్రైజ్ ఏంటంటే పోసాని క్రిష్ణ మురళి. అయన
పేరు చెప్పగానే మీ పెదవులపై ఒక చిరునవ్వు వస్తే ఏం చేయగలం.. అది అయనకే
సొంతమైన టాలెంట్. ఈ సినిమాలో తేజు తండ్రిపాత్రలో పొసాని నటిస్తున్నారట.
తేజు-పోసాని బంధం ఎమోషనల్ గా సాగుతుందట. ఒకవైపు హీరోయిన్లతో లవ్ ట్రాక్
ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో తండ్రితో బాండ్ కూడా ఈక్వల్ గా అంతే పవర్ఫుల్ గా
ఉంటుందట. టైటిల్స్ నుండి ఎండ్ కార్డ్ వరకూ తేజు-పోసాని ట్రాక్
హీరో-హీరోయిన్ల లవ్ స్టొరీకి సమాంతరంగా సాగుతుందట. పోసాని అంటేనే ఒక
ఎమోషన్.. ఆయనతో తేజు ఎమోషనల్ సీన్స్ అంటే డౌట్ లేకుండా ఆడియన్స్ ను ఎమోషనల్
చేస్తాయని మనం ఫిక్స్ అయిపోవచ్చు.
కల్యాణి ప్రియాదర్శన్.. నివేద
పెతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. 'చిత్రలహరి'కి దేవీ
శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు
నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.