Begin typing your search above and press return to search.

మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది

By:  Tupaki Desk   |   18 Oct 2017 5:32 PM GMT
మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది
X
ఇండియాలో హేమ మాలిని అంటే తెలియని వారు ఉండరు. బాలీవుడ్ లో అప్పట్లో అగ్ర కథానాయికంగా ఆమె కొనసాగారు. తెలుగులో కూడా పాండవ వనవాసం - శ్రీకృష్ణ విజయం అలాగే చాలా ఏళ్ల తర్వాత బాలకృష్ణ - గౌతమి పుత్ర శాతకర్ణిలో కూడా కనిపించారు. ఇక రాజకీయాల్లో కూడా ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. భాజపా ఎంపీ గా ఉన్న ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే రీసెంట్ గా ఆమె 69వ పుట్టిన రోజు సందర్భంగా తన జీవితాధారంగా రాసిన ‘హేమమాలిని: బియాండ్‌ ది డ్రీమ్‌ గర్ల్‌’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ వేడుక ముంబయి లో సోమవారం జరిగింది. వేడుకలో అమితాబ్‌ బచ్చన్‌ - దీపిక పదుకొణె వంటి తారలతో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హేమ తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. నాకు కార్ ఆక్సిడెంట్ అయినప్పుడు సన్నీ డియోల్ అక్కడికి. వచ్చాడు అతను నా సొంత కొడుకు కాకపోయినా మా ఇద్దరి మధ్యా అంత కంటే ఎక్కువా ఆప్యాయత అనుబంధాలు ఉన్నాయి. తను నాకు ఎలాంటి సహాయమైన చేయడానికి సిద్ధంగా ఉంటాడని తన భర్త మొదటి భార్య కొడుకు గురించి చెప్పింది.

అంతే కాకుండా 2015లో నాకు కార్ ఆక్సిడెంట్ అయినప్పుడు సన్నీనే ఫస్ట్ హాస్పటల్ కి వచ్చాడని, అంతే కాకుండా వైద్యులతో మాట్లాడి తన బాగోగులను చూసుకున్నాడని ఆమె వివరించారు. అంటే బుక్ లో కాంట్రోవర్శీ ఏమన్నా ఉందా అనుకుంటున్నవారికి.. హేమ ఇలా ముందే ఆన్సర్ చెప్పేశారు. ఆల్రెడీ పెళ్ళయిన ధర్మేంద్రను.. హేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఈవిడను చేసుకున్నారు.