Begin typing your search above and press return to search.

వరుస సినిమాలతో కుమ్మేస్తున్న కుమారి

By:  Tupaki Desk   |   13 Feb 2016 4:13 AM GMT
వరుస సినిమాలతో కుమ్మేస్తున్న కుమారి
X
హేభా పటేల్ అలా ఎలా అనే చిన్న సినిమాతో పరిచయమైనా.. ఈమెకు గుర్తింపు లభించింది మాత్రం కుమారి 21ఎఫ్ చిత్రంతోనే. సుకుమార్ రైటింగ్స్ - దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ - రెండు హిట్స్ తో ఊపు మీదున్న రాజ్ తరుణ్.. అంతా కలిసి ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే, కుమారి 21ఎఫ్ తర్వాత అందరికంటే ఎక్కువగా పేరొచ్చింది మాత్రం హేభా పటేల్ కే. తన యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి.

గ్లామర్ - పెర్ఫామెన్స్ రెండూ ఉండడంతో కుమారి హీరోయిన్ కి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో రాజ్ తరుణ్ తో మరోసారి జత కడుతోంది. ఇది మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో.. మోహన్ లాల్-గౌతమి నటిస్తున్న సినిమాలోనూ హేభా యాక్ట్ చేస్తోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి పలు భాషల్లో రూపు దిద్దుకోనుంది.

శర్వానంద్ హీరోగా పి. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కూడా హేభా పటేల్ దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. ఇవే కాకుండే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి కూడా సైన్ చేయడం విశేషం. వివి వినాయక్ దగ్గర వర్క్ చేసిన ఓ కుర్రాడి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. మొత్తం మీద ఇప్పుడు నాలుగు సినిమాలను కుమారి లైన్ లో పెట్టేసిందన్న మాట.