Begin typing your search above and press return to search.

ఆ టాప్ డైరెక్ట‌ర్ ఖ‌ర్మ అన్న ట్వీట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   23 March 2018 8:00 AM GMT
ఆ టాప్ డైరెక్ట‌ర్ ఖ‌ర్మ అన్న ట్వీట్ ఎందుకు?
X
సినిమా ఇండ‌స్ట్రీకి పైర‌సీ భూతం కొత్తేం కాదు. ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. మ‌రెన్ని హెచ్చ‌రిక‌లు చేసినా పైర‌సీ జోరు ఆగని ప‌రిస్థితి. ఓవైపు పెద్ద ఎత్తున దాడులు జ‌రిపి.. నిందితుల్ని అదుపులోకి తీసుకొని.. శిక్ష‌లు వేసినా పైర‌సీని అడ్డుకోలేని ప‌రిస్థితి. పైర‌సీకి వ్య‌తిరేకంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ మొత్తం మొత్తుకున్నా.. సినీ అభిమానులు మాత్రం పైర‌సీ విష‌యంలో త‌మ తీరు మార్చుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది.

థియేట‌ర్ల మొద‌లు.. ప్రింట్ల వ‌ర‌కూ అత్యాధునిక సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి పైర‌సీకి చెక్ చెప్పేందుకు ట్రై చేసినా ఫ‌లితం రాని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక సంస్థ‌.. అత్య‌ధికంగా పైర‌సీ ద్వారా చూసిన సినిమా ఏమిట‌న్న ఒక స‌ర్వే నిర్వ‌హించారు. గ‌డిచిన ఏడాదిలో పైర‌సీకి ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన సినిమాల‌కు సంబంధించి నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వ‌చ్చాయి.

అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించి.. త్వ‌ర‌లో చైనా రిలీజ్ త‌ర్వాత దేశ సినిమా చ‌రిత్ర‌లోనూ రికార్డు క్రియేట్ చేసే వీలుంద‌ని భావిస్తున్న‌ బాహుబ‌లి 2 అత్య‌ధికంగా పైర‌సీకి గురికాగా.. డీజే త‌ర్వాతి స్థానంలో నిలిచింది. ఈ రెండు సినిమాల‌ను ఎక్కువ మంది షేర్ చేసుకున్నార‌ని.. పైర‌సీ ద్వారా చూసిన‌ట్లుగా స‌ర్వే వెల్ల‌డించింది. ఈ స‌ర్వేలో అర్జున్ రెడ్డి మూవీకి మూడో స్థానం ద‌క్కింది. ఈ పైర‌సీ స‌ర్వేపై స్పందించిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఖ‌ర్మ అంటూ ట్వీట్ పోస్ట్ చేశారు.