Begin typing your search above and press return to search.

‘సంతోషం’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..

By:  Tupaki Desk   |   20 July 2017 5:06 PM GMT
‘సంతోషం’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే..
X
కొందరు హీరోయిన్లు ఒక సినిమాతో మెరుపులు మెరిపిస్తారు. తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. టాలీవుడ్లో అలాంటి హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు.. ‘గీతాంజలి’ గిరిజనే. ‘గీతాంజలి’తో గిరిజ ఎలాంటి గుర్తింపు సంపాదించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ తర్వాత ఆమె ‘హృదయాంజలి’ అనే అవార్డు సినిమా మినహా ఇంకేవీ చేయలేదు. ఫారిన్లో వెళ్లి సెటిలైపోయింది. బాలీవుడ్ హీరోయిన్ గ్రేసీ సింగ్ కూడా ఈ కోవలోకే వస్తుంది. తెలుగులో ‘సంతోషం’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది గ్రేసీ. ఆ తర్వాత మోహన్ బాబుతో ‘అప్పు చేసి పప్పు కూడు’ అనే ఇంకో సినిమా కూడా చేసింది. ఆ తర్వాత మాత్రం ఆమె కనిపించలేదు.

బాలీవుడ్లో లగాన్.. మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించినప్పటికీ గ్రేసీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. అలాగని గ్రేసీ పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడలేదు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన గ్రేసీ.. ఓవైపు నృత్య ప్రదర్శనలు ఇస్తూ.. మరోవైపు టీవీ సీరియళ్లు చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. ఈ రోజే 37వ పుట్టిన రోజు జరుపుకున్న గ్రేసీ.. తన మేనకోడలితో కలిసి ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ చిన్నారి పుట్టిన రోజు కూడా నేడేనట. ఈ ఫొటోల్లో గ్రేసీని చూస్తే.. ‘సంతోషం’లో నటించిన అమ్మాయి ఈమేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. అంతలా మార్పులొచ్చేశాయి గ్రేసీలో.