Begin typing your search above and press return to search.

ఒక అరవింద్ స్వామి.. నలుగురు హీరోయిన్లు

By:  Tupaki Desk   |   21 Jun 2017 9:11 AM GMT
ఒక అరవింద్ స్వామి.. నలుగురు హీరోయిన్లు
X
హీరోగా చేసింది తక్కువ సినిమాలే కానీ.. వాటితో బలమైన ముద్రే వేశాడు అరవింద్ స్వామి. రోజా.. బొంబాయి.. మెరుపు కలలు లాంటి సినిమాలతో అమ్మాయిల మనసుల్ని కొల్లగొట్టేశాడు ఈ అందగాడు. ఐతే చాలా త్వరగా సినిమాలకు దూరమై అందరినీ ఆశ్చర్యపరిచిన స్వామి.. కొన్నేళ్ల పాటు లైమ్ లైట్లోనే లేకుండా పోయాడు. అదే సమయంలో పొట్ట పెంచి.. బట్టతలతో దర్శనమిచ్చి అందరికీ పెద్ద షాకిచ్చాడు. ఇక అరవింద్ స్వామి చరిత్రలో కలిసిపోయినట్లే అనుకుంటుండగా.. కొన్నేళ్ల కిందట మొత్తం ఫిజిక్.. లుక్ మార్చుకుని అందంగా తయారై సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ‘తనీ ఒరువన్’లో అదిరిపోయే క్యారెక్టర్ వేసి మొత్తం సౌత్ ఇండియన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

ఆ ఊపులో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అరవింద్ స్వామి. ప్రస్తుతం తమిళంలో అతను హీరోగా వరుసగా సినిమాలు తయారవుతున్నాయి. త్రిషతో కలిసి ‘శతురంగ వేట్టై-2’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్న అరవింద్ స్వామి.. తాజాగా సెల్వ అనే దర్శకుడితో ‘వానందమూడి’ అనే పోలీస్ స్టోరీ చేస్తున్నాడు. సెల్వ ఇంతకుముందే అరవింద్ స్వామితో ఎప్పుడో 1997లో ‘పుదయల్’ అనే సినిమా చేశాడు. మళ్లీ 20 ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం. దీని కంటే పెద్ద విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో అరవింద్ స్వామి సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సిమ్రాన్.. రితికా సింగ్.. నందిత శ్వేత.. శాంతిని ఇందులో కథానాయికలుగా చేస్తున్నారు. ఇదొక టిపికల్ పోలీస్ స్టోరీ అని.. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషనే ఈ చిత్రానికి హైలైట్ అని అంటున్నారు. ‘తనీ ఒరువన్’లో వైట్ కాలర్ క్రిమినల్ క్యారెక్టర్ చేసిన అరవింద్.. ఇప్పుడు పోలీస్ పాత్రలో మెరవబోతుండటం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/