Begin typing your search above and press return to search.

యాంకర్ ప్రాణం ఎలా పోయిందో చూస్తే షాకే..

By:  Tupaki Desk   |   22 July 2017 10:18 AM GMT
యాంకర్ ప్రాణం ఎలా పోయిందో చూస్తే షాకే..
X
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఘోరం జరిగింది. ఉదయం వేళ వాకింగ్ కోసం వెళ్లిన మహిళ దిగ్భ్రాంతికర రీతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన పాటికి తాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్టు కూలిపోయి ఆమె మీద పడింది. తనకేం జరిగిందో తెలుసుకునే లోపే ఆ మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్ అని గుర్తించారు. ఆమె వయసు 58 సంవత్సరాలు. ముంబయిలోని చెంబూర్ ప్రాంతంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు మరో వైపు ఉన్న ఓ దుకాణంలో ఉన్న సీసీటీవీలో ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి.

దూరదర్శన్‌ మాజీ యాంకర్‌.. యోగ టీచర్‌ కూడా అయిన కంచన్‌ నాథ్‌ రోజూ తన ఇంటికి సమీపంలోని ఓ మార్గంలో మార్నింగ్ వాక్ కు వెళ్తారు. శుక్రవారం కూడా అలాగే వెళ్లారు. ఆ సమయంలో ఓ మోస్తరుగా గాలులు వీస్తున్నాయి. సరిగ్గా ఈ చెట్టుకు సమాంతరంగా కంచన్ నాథ్ నడుస్తున్న సమయంలోనే హఠాత్తుగా అది కూలిపోయి ఆమె మీదే పడింది. చెట్టు నేరుగా మీద పడటంతో కంచన్ దాని కంద పడి నలిగిపోయింది. అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం కన్ను మూశారని కంచన్‌ భర్త తెలిపారు. కంచన్ మృతికి బాంబే మున్సిపల్‌ కార్పోరేషన్‌ (బీఎంసీ) బాధ్యత వహించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ చెట్టును కొట్టివేసే ప్రయత్నం చేయగా.. బీఎంసీ అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు.