Begin typing your search above and press return to search.

మళ్ళీ అదే క్యాంపులో చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   22 Sep 2017 5:30 PM GMT
మళ్ళీ అదే క్యాంపులో చేస్తున్నాడు
X
కెరీర్ మొదట్లో ఇండస్ట్రీ హిట్స్ లాంటి సినిమాలను తీసిన దర్శకుడు తేజ. స్టార్స్ లేకపోయినా మంచి లవ్ స్టోరీలను తెరకెక్కించి ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన వరుస అపజయాలతో సతమతమైన సంగతి తెలిసిందే.. దీంతో రానా తో కొత్తగా ట్రై చేసి నేనే రాజు నేనే మంత్రి సినిమాను తీశారు. సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ తేజా ఫామ్ లోకి వచ్చేశాడు.

అయితే ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తాడా అని గత కొంతంకాలంగా అనేక రాగాల వార్తలు వెలువడుతున్నాయి. బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ అనే మాట కూడా వచ్చేసింది. అయితే తేజా ఫైనల్ గా వెంకీతో సినిమాకు రెడీ అయ్యాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ కి మంచి హిట్ ని ఇచ్చిన తేజ మళ్లీ అదే క్యాంపులో లో సినిమా తియ్యనున్నాడని తెలుస్తోంది. రానా తో తీసిన సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో సురేష్ బాబు మరోసారి ఇచ్చిన అఫర్ కి తేజా నో చెప్పలేదు. ఎందుకంటే తేజా అపజయాల్లో ఉన్నపుడు నమ్మి సినిమా అవకాశం ఇచ్చారు సురేష్ బాబు. అందుకు కృతజ్ఞతతో వెంకీని డైరెక్ట్ చేయబోతున్నాడు తేజ.

అయితే ఇంతకుముందే వీరిద్దరి కలయికలో సావిత్రి సినిమా రాబోతుందని అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. కానీ అది సెట్ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఈ కాంబినేషన్ ను సురేష్ బాబు సెట్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈ కథ కుడా చాలా వినూత్నంగా ఉండబోతోందని టాక్. వెంకీ కూడా ఇప్పటివరకు ఒక్క సినిమాను మొదలు పెట్టలేదు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది.