Begin typing your search above and press return to search.

హీరో మాజీ భార్యపై ట్రావెల్ బ్యాన్

By:  Tupaki Desk   |   20 July 2017 5:21 PM GMT
హీరో మాజీ భార్యపై ట్రావెల్ బ్యాన్
X
ఒకవైపు టాలీవుడ్ ను డ్రగ్స్ సంక్షోభం వెంటాడుతుంటే.. ఇదే సమయంలో మలయాళ సినీ పరిశ్రమను మరో సమస్య వెంటాడుతోంది. ఫిబ్రవరిలో ఓ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఇప్పటికే హీరో దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేరళ పోలీసులు.. అటు నేరంలో భాగం ఉందని అనుమానించిన వారిని.. ఇటు విచారణకు సహకరించే వారిని.. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు దిలీప్ మాజీ భార్య.. మలయాళ యాక్ట్రెస్ అయిన మంజు వారియర్ వరకూ వచ్చేశారు పోలీసులు. ఈ కేసు విచారణ పూర్తయే వరకూ.. దేశం వదిలి వెళ్లడానికి వీల్లేదని మంజు వారియర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ టా్రవెల్ బ్యాన్ కు ఆమె కూడా సరే అని చెప్పిందట. నిజానికి ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే.. ఈ పాటికే మంజు వారియర్ అమెరికా టూర్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె ఆ టూర్ ను క్యాన్సిల్ చేసుకుని కేరళలోనే ఉండిపోగా.. ఇందుకు పోలీసులు విధించిన ఆంక్షలే కారణం అని చెప్పుకుంటున్నారు.

కానీ ఈ కేసులో ఆ కిడ్నాప్ నకు గురైన హీరోయిన్.. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ మంచి స్నేహితులు. ఈ కేసు విషయంలో విచారణ జరిపించి తీరాల్సిందేనని మొదటగా పట్టు పట్టినది ఈమే. మలయాళ సినీ పరిశ్రమ మొత్తం ఆ హీరోయిన్ కు సపోర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తి కూడా మంజునే కావడం విశేషం. అయితే.. పోలీసుల ఆంక్షల మేరకే అమెరికా వెళ్లలేదన్న వార్తలను మంజు వారియర్ సన్నిహితులు ఖండిస్తున్నారు. ఆమె వ్యక్తిగత కారణాలతోనే ఈ టూర్ రద్దు చేసుకుందని అంటున్నారు.