Begin typing your search above and press return to search.

రాజుగారు.. నైజాంలో దేవాదిదేవుడు

By:  Tupaki Desk   |   5 Aug 2015 7:00 AM GMT
రాజుగారు.. నైజాంలో దేవాదిదేవుడు
X
దిల్‌రాజు.. ఈ పేరు ఇటీవలి కాలంలో ఫిలింసర్కిల్స్‌ లో మార్మోగిపోతోంది. అతడు చెయ్యేస్తే చాలు మట్టి కూడా బంగారం అయిపోతోంది. మిడాస్‌ టచ్‌ అన్న పదానికి పర్యాయపదం అంటూ పొగిడేస్తున్నాడు. అన్నేళ్లుగా అస్సలు ఒక్క హిట్టు కూడా లేని మణిరత్నం 'ఓకే బంగారం' అనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ సినిమా నైజాం రిలీజ్‌ హక్కుల్ని దిల్‌రాజు కొనుక్కున్నారు. సినిమా పెద్ద హిట్టెక్కింది. నైజాంలో భారీ లాభాలార్జించారు. అంతకంటే ముందే లారెన్స్‌ 'గంగ' సినిమా ముక్కుతూ మూలుగుతూ ఉంటే రాజుగారే దగ్గరుండి రిలీజ్‌ చేయించారు.

గంగ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి బోలెడంత డబ్బు తెచ్చిపెట్టింది. కళ్యాణ్‌ రామ్‌ ని నమ్మి 'పటాస్‌'ని రిలీజ్‌ చేసింది రాజుగారే. నైజాంలో వసూళ్లు దుమ్ము రేపేసింది ఈ సినిమా. ఇప్పుడు వంతు బాహుబలి. ఈ సినిమాని నైజాంలో రిలీజ్‌ చేసింది దిల్‌రాజు. సంచుల కొద్దీ సొమ్ముల్ని తెచ్చిపెట్టింది ఇప్పటికే. అసలు రాజుగారు టచ్‌ చేస్తే చాలు... ఆ సినిమా బంపర్‌ హిట్టే. ఇప్పుడు ఓ చిన్న సినిమాని కూడా రాజుగారు టచ్‌ చేశారు. ఉయ్యాల జంపాల ఫేం రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన 'సినిమా చూపిస్త మావ' చిత్రాన్ని నైజాంలో ఆయనే రిలీజ్‌ చేస్తున్నారు. అంటే మిడాస్‌ టచ్‌ దక్కినట్టే.