Begin typing your search above and press return to search.

దిల్ రాజు చెయ్యి పడిందంటే...

By:  Tupaki Desk   |   24 March 2018 8:47 AM GMT
దిల్ రాజు చెయ్యి పడిందంటే...
X
పూరీ జగన్నాధ్ టైం ప్రస్తుతం ఏమంత గొప్పగా లేదు. వరుస పరాజయాలు వెక్కిరిస్తున్న సమయం ఇది. అయితే తను బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు.. తన కొడుకు ఆకాష్ ను పర్ఫెక్ట్ లాంఛ్ చేసేందుకు మెహబూబా చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై తనే స్వయంగా నిర్మించి మరీ తెరకెక్కించాడు.

ఇప్పుడు మెహబూబాతో దిల్ రాజు కూడా అసోసియేషన్ ఏర్పరచుకున్నాడు. ఏ విషయంలో వీరిద్దరికీ మధ్య భాగస్వామ్యం కుదిరిందో డీటైల్డ్ గా చెప్పలేదు కానీ.. డిస్ట్రిబ్యూషన్ తో పాటు రైట్స్ విక్రయంలో డీల్ కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. మెహబూబా మూవీకి దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ - పూరీ కనెక్ట్స్ అధికారికంగా భాగస్వామ్యం ఏర్పరచుకుందని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు పూరీ. అయితే.. ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి. దిల్ రాజు ఓ సినిమాతో అసోసియేట్ కావడం అరుదుగానే జరుగుతుంది. సినిమాకు ముందే ఏదైనా మూవీతో దిల్ రాజు ఒప్పందాలు చేసుకోవడం అంటే.. ఆ సినిమాలో కచ్చితంగా మ్యాటర్ ఉన్నట్లే.

ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు ప్రూవ్ అయింది. దిల్ రాజు జడ్జిమెంట్ పై జనాల్లో కూడా మంచి నమ్మకం ఉంది. మరోవైపు పూరీ ఎంతో జాగ్రత్తగా రూపొందించిన మూవీ.. టీజర్ తో మంచి బజ్ కూడా క్రియేట్ చేయగలిగారు.. ఇప్పుడు దిల్ రాజు కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. మొత్తం మీద మెహబూబాకు అన్నీ కలిసొచ్చేస్తున్నాయి. మే నెల 11వ తేదీన మెహబూబాను విడుదల చేయనున్నట్లు తెలిపాడు పూరీ జగన్నాథ్.