Begin typing your search above and press return to search.

కీర్తి-నగేష్ కుకునూర్ సినిమాకు దిల్ రాజు టచ్

By:  Tupaki Desk   |   15 July 2019 7:26 AM GMT
కీర్తి-నగేష్ కుకునూర్ సినిమాకు దిల్ రాజు టచ్
X
తెలుగువాడైన బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ కీర్తి సురేష్ - ఆది పినిశెట్టి జంటగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రెజెంట్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకొచ్చారట. సినిమా కంటెంట్ చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సమర్పించేందుకు రెడీ అయ్యారట.

ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాతలు వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ వారు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెల్కం ఆన్ బోర్డ్ సర్ అంటూ దిల్ రాజును తమ టీమ్ లోకి ఆహ్వానించారు. దిల్ రాజు ఈ టేకప్ చేయడంతో ఈ సినిమా ప్రమోషన్స్.. రిలీజ్ విషయంలో నిర్మాతలకు మంచి ఎడ్వాంటేజ్ దక్కడం ఖాయం. ఈ సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్ ను త్వరలో త్వరలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు వెల్లడించారు.

ఈ సినిమాలో జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. స్పోర్ట్స్ ప్లస్ రొమాన్స్ జోనర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉందని సమాచారం.