Begin typing your search above and press return to search.

మెగా మేనల్లుడితో రాజుకు చెడిందా?

By:  Tupaki Desk   |   8 Feb 2016 5:30 PM GMT
మెగా మేనల్లుడితో రాజుకు చెడిందా?
X
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే పిల్లా నువ్వు లేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ రిలీజ్ కాగా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తేజు మూవీ సుప్రీం కూడా దిల్ రాజు బ్యానర్ వెంకటేశ్వర క్రియేషన్స్ పైనే. సుప్రీం ప్రారంభించే సమయంలో దిల్ రాజు-తేజు కాంబినేషన్ పై ఓ పెద్ద న్యూస్ వచ్చింది.

మెగా సుప్రీం స్టార్ సాయిధరం తేజ్ తో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నాడని.. ఇందుకోసం 12 కోట్ల రూపాయల డీల్ సెట్ చేసుకున్నాడని అన్నారు. ఇందులో భాగంగా శతమానం భవతి అనే టైటిల్ తో ఓ సినిమా చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. రైటర్ నుంచి డైరెక్టర్ గా ప్రమోష్ పొందిన వేగేశ్న సతీష్ డైరెక్షన్ లో శతమానం భవతి చిత్రాన్ని తీయాలని భావించారు. ఇప్పుడా ప్రాజెక్ట్ ను మెగా మేనల్లుడితో కాకుండా.. హ్యాట్రిక్ హిట్స్ తో కుమ్మేస్తున్న కొత్త కుర్రాడు రాజ్ తరుణ్ తీయాలని దిల్ రాజు డిసైడ్ కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈ ఏడాది సమ్మర్ నాటికి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కోసం.. ఇప్పటికే రాజ్ తరుణ్ కు చెప్పడం, ఆ హీరో ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయంటున్నారు. హఠాత్తుగా మెగా మేనల్లుడితో తీయాల్సిన ప్రాజెక్ట్ లోకి రాజ్ తరుణ్ తీసుకోవడం వెనుక.. వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.