Begin typing your search above and press return to search.

దిల్ రాజు దెబ్బకి సినిమా ఆగిందా?

By:  Tupaki Desk   |   18 Aug 2017 6:43 AM GMT
దిల్ రాజు దెబ్బకి సినిమా ఆగిందా?
X
కొన్నిసార్లు మన తెలుగు సినిమాలు పూర్తయిన సినిమాను రీ షూటింగ్ చేస్తూ ఉంటారు. అంటే కథను పూర్తిగా మార్చరు. ఆ కథలో కొన్ని సన్నివేశాలను మరింత మంచిగా మేకింగ్ చేసి ఆ సినిమా కమర్షియల్ విలువను కొంచెం పెంచడానికి చేస్తారు. ఇలా అందరి సినిమాలకు మళ్ళీ చేయరు ఒక స్టార్ హీరో తాలూకు పిల్లలకు మాత్రమే ఈ సదావకాశం. మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వచ్చిన మొదటిలో సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు ఎందుకు వరుస ఫ్లాప్ లలో పడ్డాడు అని తెగ ఆలోచిస్తున్నారు.

మొదటి రెండు సినిమాలు మంచి కమర్షియల్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ తరువాత వచ్చిన ‘తిక్క’ - ‘విన్నర్’ - ఇప్పుడు తాజాగా కృష్ణ వంశీ డైరక్షన్లో వచ్చిన ‘నక్షత్రం’ బాక్స్ ఆఫీసు వద్ద కనీస కలెక్షన్లకు నోచుకోలేదు. ఈ మేనల్లుడు చేసిన దాదాపు అన్నీ సినిమాలలో ప్రొడ్యూసర్ దిల్ రాజు హస్తం ఉంది. ఇప్పుడు వస్తున్న ‘జవాన్’ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ కాకపోయినా ఆ సినిమాను మార్కెటింగ్ చేసే భాద్యతలు తీసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎడిటర్ కట్ చూసిన దిల్ రాజు చాలా అసంతృప్తి చెందాడని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో తీయలేదుని అభిప్రాయపడ్డాడు. అందుకని అలాంటి కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీ షూట్ చేయమని సలహాలు కూడా ఇచ్చి వచ్చాడు అంటా దిల్ రాజు. అయితే ఈ సినిమాను పూరీ జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న పైసా వసూల్ విడుదల రోజు విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు జవాన్ ఫిల్మ్ హౌస్ నుండి వస్తున్న టాక్ బట్టి సెప్టెంబర్ 1 న వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

దిల్ రాజు మాత్రం జవాన్ టీమ్ వాళ్ళకి తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడట. సినిమాలో కొన్ని చోట్ల మార్పులు చేయవలిసి ఉంది అవి ఏవి చేయకుండా రిలీజ్ డేట్ ని ప్రకటించవద్దు ఈ విషయంలో తొందరపడవద్దు అన్నాడట. అలా చూసుకుంటే.. ఆయన మాట దెబ్బతో జవాన్ సినిమా సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశం లేనేట్లే. బహుశా మరో నెల రెండు నెలలు కూడా పట్టొచ్చు. చూద్దాం.