Begin typing your search above and press return to search.

చైతూ సినిమాను పక్కనబెట్టి అది పూర్తి చేశాడు

By:  Tupaki Desk   |   28 Oct 2016 10:30 PM GMT
చైతూ సినిమాను పక్కనబెట్టి అది పూర్తి చేశాడు
X
తెలుగులో మన నాని లాగే చాలా స్పీడుగా ఉంటూనే క్వాలిటీ మిస్ కాకుండా ఉండేలా చూసుకుంటుంటాడు ధనుష్. ఈ ఏడాది ఆల్రెడీ ‘రైల్’ సినిమా రిలీజైంది. ఆ సినిమా కాన్సెప్ట్ మంచిదే కానీ.. ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడంతో ఆడలేదు. ఇక లేటెస్టుగా ‘కోడి’ సినిమాతో ధనుష్ ఖాతాలో హిట్టు పడ్డట్లే ఉంది. ఈ ఏడాది ధనుష్ ఇంకో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఆ సినిమా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసింది కావడం విశేషం. ఆ సినిమా పేరు.. ఎన్మేల్ పాయుమ్ తొట్ట. ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.

విశేషం ఏంటంటే ఈ సినిమా మొదలైన మూడు నెలలకే పూర్తయిపోయింది. దీని కంటే ముందు గౌతమ్ మీనన్.. నాగచైతన్యతో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చేశాడు. ఆ సినిమా తెలుగులో పూర్తయింది కానీ.. తమిళ వెర్షన్ మాత్రం శింబు పుణ్యమా అని ఆగిపోయింది. శింబు అనేక వివాదాల్లో చిక్కుకుని షూటింగుకి రాలేని పరిస్థితుల్లో ఉండటంతో ఈ ప్రాజెక్టను పక్కనబెట్టేశాడు గౌతమ్. తెలుగు వెర్షన్ సంగతి కూడా పట్టించుకోకుండా ఫోకస్ మొత్తం ధనుష్ మూవీ మీదే పెట్టాడు. ఇది భారీ బడ్జెట్ సినిమా అయినా.. మూడు నెలల్లో పూర్తయిపోవడం విశేషమే. మలయాళ అమ్మాయి మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మన రానా దగ్గుబాటి కీలక పాత్రను చేయడం విశేషం. ఈ చిత్రం డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.